News February 22, 2025

భద్రాద్రి: జడ్జి ముందు దాడి.. మహిళకు జైలు శిక్ష..!

image

కోర్టు హాల్లోకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడిన పాల్వంచ వెంకటేశ్వర కాలనీకి చెందిన కొడాలి నర్మదకు ఏడాదిన్నర పాటు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సుచరిత శుక్రవారం తీర్పు చెప్పారు. 2017 ఫిబ్రవరి 28న కొత్తగూడెం కోర్టులో వాయిదాకు హాజరైన పాల్వంచ మండలం ఇల్లందులపాడుకు చెందిన గుగులోత్ మాన్సింగ్‌ను ఆమె జడ్జి ముందే దాడి చేసింది. ఈ కేసులో ఆమెకు శిక్ష పడింది.

Similar News

News March 17, 2025

జియ్యమ్మవలసలో ఏనుగులు గుంపు సంచారం

image

జియ్యమ్మవలస మండలం నందివాని వలస, తోటపల్లి, సింగాణపురం గౌరీపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి చెరకు, అరటి తోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయవద్దని, రైతులు పొలాలకు వెళ్లొద్దని సూచించారు. 

News March 17, 2025

చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

image

చంద్రుడిపై పరిశోధనలు చేపట్టే చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2లో 25 KGల బరువు ఉన్న రోవర్ ‘ప్రజ్ఞాన్’ను జాబిల్లిపైకి తీసుకెళ్లగా, చంద్రయాన్-5లో 250 కేజీల రోవర్‌ను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ సాయంతో నిర్వహిస్తామన్నారు. ఇక జాబిల్లిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో చంద్రయాన్-4 మిషన్‌ను ప్రయోగిస్తామని చెప్పారు.

News March 17, 2025

నరసరావుపేట: 10వ తరగతి విద్యార్థులకు డీఈవో సూచనలు

image

సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరాలని డీఈవో చంద్రకళ సూచించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తుందన్నారు. అత్యవసర సమయాలలో విద్యార్థులు 100 ఫోన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.

error: Content is protected !!