News April 6, 2025

భద్రాద్రి జిల్లాకు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ

image

భద్రాద్రి జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు చెప్పారు. అన్ని సహజ వనరులు మెరుగైన అవకాశాలు ఉన్న మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి పలుమార్లు సీఎంకు వినతి పత్రాలు అందచేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 28, 2025

‘టీఈ-పోల్’ యాప్ వినియోగించండి: వరంగల్ కలెక్టర్

image

ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారం సులభంగా చేరేందుకు రూపొందించిన టీఈ-పోల్ మొబైల్ యాప్‌ను వినియోగించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె, గూగుల్ స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రం, ఓటర్ స్లిప్ వంటి వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.

News November 28, 2025

MBNR: తొలిరోజు నామినేషన్లు ఎన్నంటే?

image

తొలి విడతలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 548 గ్రామ పంచాయతీల్లో సర్పంచు స్థానాలకు 441, వార్డు మెంబర్ స్థానాలకు 176 నామినేషన్లు దాఖలయ్యాయి. MBNR 137 గ్రామాలలో 108 మంది సర్పంచ్ పోస్టుకు నామినేషన్లు వేశారు. NRPT 67 గ్రామాల్లో 69 మంది, WNP 87 గ్రామాల్లో 75 మంది నామినేషన్ వేయగా.. గద్వాల 106 గ్రామాల్లో 68 పంచాయతీలకు సర్పంచ్ నామినేషన్లు వేశారు. ఇక NGKLలో 151 గ్రామాలు ఉండగా 121 దాఖలైయ్యాయి.

News November 28, 2025

జహిరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య

image

భర్తతో విభేదాలు, వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జహీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్దిపాడుకు చెందిన స్వాతికి(22) ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు, అత్తమామ వేధిస్తున్నారని మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కాశీనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.