News March 27, 2025

భద్రాద్రి: జిల్లాలో కాంగ్రెస్ ప్రక్షాళన జరుగుతుందా?

image

కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో నేడు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. KTDM జిల్లా డీసీసీ చీఫ్‌గా పోదెం వీరయ్య ఉన్నారు. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలామంది పోటీపడుతున్నారు. ఈ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.

Similar News

News November 25, 2025

పార్వతీపురంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం

image

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం వన్ స్టాప్ సెంటర్ ఆవరణలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. పిల్లల్లో పౌష్టికాహారం, పరిశుభ్రత లోపం లేకుండా చూడాలన్నారు. అలాగే గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News November 25, 2025

పార్వతీపురంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం

image

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం వన్ స్టాప్ సెంటర్ ఆవరణలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. పిల్లల్లో పౌష్టికాహారం, పరిశుభ్రత లోపం లేకుండా చూడాలన్నారు. అలాగే గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News November 25, 2025

రాష్ట్రస్థాయి బాలికల హాకీ పోటీల విజేత తూ.గో జిల్లా

image

రాష్ట్రస్థాయి అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల హాకీ పోటీల్లో తూ.గో జిల్లా జట్టు విజయదుందుభి మోగించింది. సోమవారం జరిగిన ఫైనల్ పోటీల్లో ఈస్ట్ గోదావరి జట్టు క్రీడాకారిణులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి విజేతగా నిలిచారు. నక్కపల్లి హాకీ గ్రౌండ్లో జరిగిన బాలికల హాకీ ఫైనల్ పోటీలలో తొలి రోజు నుంచి ఆ జట్టు తిరుగులేని ఆదిత్యతను కనబరుస్తూ కప్పు చేజిక్కించుకుంది. ఆ జట్టుకు షీల్డ్ అందజేశారు.