News March 16, 2025
భద్రాద్రి జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) KG రూ. 160 ఉండగా, స్కిన్లెస్ కేజీ రూ. 180 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 110 మధ్య ఉంది. కాగా బడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు తెలుపుతున్నారు.
Similar News
News October 31, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 65,362 హెక్టార్లలో పంట నష్టం

మెుంథా తుఫాన్ కారణంగా అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం.. 65,362 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. సుమారు 74వేల మంది రైతుల పొలాలు దెబ్బతిన్నాయి. కృష్ణా (D) 46,357 హెక్టార్లలో నష్టం. వరి 45వేల హెక్టార్లు, మినుము 985 హెక్టార్లు, వేరుశనగ 288 హెక్టార్లు, పత్తి 48 హెక్టార్లు. NTR (D) 19,005 హెక్టార్లలో నష్టం. పత్తి 10వేల హెక్టార్లు, వరి 6వేల హెక్టార్లు.
News October 31, 2025
అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు కోరిన స్పీకర్

MLAల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలలు గడువు కావాలని TG స్పీకర్ G ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.10 మంది MLAలకు నోటీసులివ్వగా 8 మంది స్పందించారు. వీరిలో 4గురి విచారణ ముగిసింది. SC విధించిన గడువు నేటితో ముగియడంతో మిగతా వారి విచారణకు సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోరారు. నోటీసులకు స్పందించని ఇద్దరిపైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. కాగా కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.
News October 31, 2025
GNT: తప్పుడు ప్రచారాలపై పోలీస్ దృష్టి

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పోలీసులపై తప్పుడు పోస్టులు పెరగడంతో గుంటూరు పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనుంది. వాట్సాప్ గ్రూపుల్లో అధికారులను సభ్యులుగా చేర్చి బ్లాక్మెయిలింగ్ చేస్తున్న ఘటనలపై ఫిర్యాదులు రావడంతో 15 గ్రూపులను గుర్తించారు. తొలి దశలో 10 గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు జారీ చేశారు. లాలాపేట, నగరంపాలెం, అరండల్పేట, పొన్నూరు, పెదకాకానిలో నివసించే అడ్మిన్లను విచారణకు పిలిపించారు.


