News March 15, 2025
భద్రాద్రి జిల్లాలో జబర్దస్త్ నటుల సందడి

భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ జగదాంబమాత జయలింగేశ్వర స్వామివారి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఈవెంట్కు వచ్చిన జబర్దస్త్ నటులకు ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికింది. అనంతరం వారికి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జ్ఞాపికలు అందించి, సత్కరించారు. తిరునాళ్లలో రాకెట్ రాఘవ టీం సందడి చేశారు.
Similar News
News December 4, 2025
ఖమ్మం: ఎన్నికల్లో తల్లీకూతుళ్ల సమరం..!

ఖమ్మం జిల్లా: పెనుబల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన పోరు నెలకొంది. సర్పంచ్ పదవి కోసం తల్లి తేజావత్ సామ్రాజ్యం, కూతురు బానోతు పాప ప్రత్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. సొంత కుటుంబ సభ్యులే ఒకే పదవికి పోటీ పడుతుండటంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఆసక్తికరమైన పోరాటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, విజయం ఎవరిని వరిస్తుందోనని స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
News December 4, 2025
వనపర్తి: 45 సర్పంచ్ నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు బుధవారం మొత్తం 45 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావిలోని 17 GPలకు – 9 నామినేషన్లు.
✓ పానగల్లోని 28 GPలకు – 15 నామినేషన్లు.
✓ పెబ్బేరులోని 20 GPలకు – 13 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్లోని 8 GPలకు – 6 నామినేషన్లు.
✓ వీపనగండ్లలోని 14 GPలకు – 2 నామినేషన్లు దాఖలయ్యాయి.
News December 4, 2025
WGL: గుర్తులొచ్చాయ్.. ఉదయం 6 నుంచే షురూ

వరంగల్: పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్ ఈ నెల 11వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. పోలింగ్కు వారం రోజులే సమయం ఉండడం, బుధవారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు.


