News March 15, 2025
భద్రాద్రి జిల్లాలో జబర్దస్త్ నటుల సందడి

భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ జగదాంబమాత జయలింగేశ్వర స్వామివారి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఈవెంట్కు వచ్చిన జబర్దస్త్ నటులకు ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికింది. అనంతరం వారికి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జ్ఞాపికలు అందించి, సత్కరించారు. తిరునాళ్లలో రాకెట్ రాఘవ టీం సందడి చేశారు.
Similar News
News February 23, 2026
కర్నూలు జిల్లాలో రైతులకు పుష్కలంగా యూరియా నిల్వలు

కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 రబీ సీజన్ కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశారు. యూరియాను అధిక ధరలకు అమ్మినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల కొరతపై ఫిర్యాదుల కోసం 8341302863 నంబర్ను సంప్రదించాలని ఆమె సూచించారు.
News February 23, 2026
HYD: MCHRD.. CM క్యాంప్ ఆఫీస్ కాబోతుందా..?

HYDలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో VVIP గెస్ట్ హౌస్ రూపురేఖలు మారబోతున్నాయి. అతిథుల భద్రతే లక్ష్యంగా దాదాపు రూ.9 కోట్లతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంపౌండ్ వాల్కు కాన్సర్టినా వైర్ ఫెన్సింగ్, అత్యాధునిక వాచ్ టవర్లు, పటిష్ఠమైన గేట్లతో పాటు పరిసరాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించనున్నారు. దీనిని CM క్యాంప్ ఆఫీస్గా వాడనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
News February 23, 2026
ఏప్రిల్ 8న AA22 ఫస్ట్ టీజర్?

అట్లీ- అల్లు అర్జున్ కాంబినేషన్లో AA22 మూవీ షూటింగ్ సగం పూర్తయినట్లు సమాచారం. తదుపరి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ టీజర్ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ పెరిగింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణే, రష్మిక, మృణాల్, జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే.


