News March 15, 2025

భద్రాద్రి జిల్లాలో జబర్దస్త్ నటుల సందడి

image

భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ జగదాంబమాత జయలింగేశ్వర స్వామివారి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఈవెంట్‌కు వచ్చిన జబర్దస్త్ నటులకు ఆలయ కమిటీ  ఘనస్వాగతం పలికింది. అనంతరం వారికి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జ్ఞాపికలు అందించి, సత్కరించారు. తిరునాళ్లలో రాకెట్ రాఘవ టీం సందడి చేశారు.

Similar News

News April 23, 2025

నకలి విత్తనాలు అమ్ముతే పీడీ యాక్ట్ పెడతాం: ASF SP

image

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్ నమోదు చేస్తామని ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు బుధవారం హెచ్చరించారు. నకిలీ విత్తనాల బారి నుంచి రైతులను కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News April 23, 2025

కూలీ కుమారుడికి 593 మార్కులు

image

గుత్తి మోడల్ స్కూల్ విద్యార్థి నరసింహ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. నరసింహ తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి కళావతి కూలీ పని చేస్తూ కొడుకును చదివిస్తోంది. పేదింటి బిడ్డ మంచి మార్కులతో సత్తా చాటడంతో ఉపాధ్యాయులు, బంధువులు విద్యార్థిని అభినందించారు. తల్లి కళావతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

News April 23, 2025

గవర్నమెంట్ స్కూల్.. 600కు 598 మార్కులు

image

AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో మెరిశారు. పల్నాడు(D) ఒప్పిచర్ల జడ్పీ స్కూల్ విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు తెచ్చుకుంది. హిందీ, ఇంగ్లిష్‌లో 99 మార్కుల చొప్పున వచ్చాయి. అన్నమయ్య(D) పెద్దవీడు, ప్రకాశం (D) అలకూరపాడు ZP స్కూల్స్ విద్యార్థినులు మేఘ, వెంకట భార్గవికి 595 మార్కులు వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివి అత్యధిక మార్కులు తెచ్చుకున్న వీరిపై ప్రశంసలు వస్తున్నాయి.

error: Content is protected !!