News February 25, 2026
భద్రాద్రి జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

భద్రాద్రి జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. 37 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 9,685మంది విద్యార్థులకు గాను 9,210 మంది (95.09%) హాజరైనట్లు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. జనరల్ విభాగంలో 7,973 మందికి 7,683 మంది, వొకేషనల్ విభాగంలో 1,712 మందికి 1,527 మంది హాజరయ్యారు. మొత్తం 475 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
పాలమూరు: ఒకేరోజు తల్లి, కొడుకు మృతి

అయిజ మండలం తూముకుంటలో గురువారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కురువ మల్లికార్జున్(37) వ్యవసాయ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విన్న తల్లి రంగమ్మ (75) ఇంటి వద్ద ఒక్కసారిగా కుప్ప కూలి మృతి చెందింది. తల్లి కొడుకు ఒకేరోజు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అతడికి భార్య, కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News April 16, 2026
ఆధార్ నవీకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. 5-7, 15-17 ఏళ్ల విద్యార్థుల ఆధార్ నవీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. గురువారం బాపట్ల కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. 17,501 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సచివాలయాల్లో శిబిరాలు నిర్వహించి, 24 గంటల్లో సవరణలు చేయాలని అధికారులకు సూచించారు.
News April 16, 2026
నెల్లూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 12.85 లక్షలు

పంచాయతీ ఎన్నికలకు నెల్లూరు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రధాన ఘట్టమైన ఓటర్ల జాబితాను పూర్తి చేశారు. జిల్లాలో 700 గ్రామ పంచాయతీల్లో 12,85,757 ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. వీరిలో పురుషులు 6,29,276 మంది, మహిళలు 6,56,403 మంది, ట్రాన్సజెండర్లు 78 మంది ఉన్నారు. 35 మండలాల్లో 700 గ్రామాల్లో 6658 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించారు.


