News February 3, 2025

భద్రాద్రి జిల్లాలో భారీగా పడిపోయిన టమాట ధర

image

భద్రాద్రి జిల్లాలో టమాట ధర రూ.10కి పడిపోయింది. కొన్ని రోజుల క్రితం టమాటకు ధర భారీగా ఉండడంతో జిల్లాలో ఈ సాగుకు రైతులు ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో సుజాతనగర్‌, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లెందు, బూర్గంపాడు, చండ్రుగొండ, కారేపల్లి మండలాల్లో కూరగాయల పంటల సాగులో భాగంగా రైతులు టమాటా సాగు చేస్తుంటారు. దీంతో రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు.

Similar News

News November 15, 2025

రెండో రోజు CII సమ్మిట్ ఫొటో గ్యాలరీ

image

AP: విశాఖలో CII సమ్మిట్ రెండోరోజు కొనసాగుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో సదస్సు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే అధినేతలకు సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలుకుతున్నారు. సమ్మిట్‌లోని పలు స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీ రాజధాని అమరావతి నమూనాను ఆసక్తిగా తిలకిస్తున్నారు. యువత కూడా ఉత్సాహంగా హాజరవుతున్నారు.

News November 15, 2025

GWL: షార్ట్ ఫిల్మ్‌కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి

image

గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్, రాజాపూర్ గ్రామాలకు చెందిన ‘పల్లెటూరి కుర్రాళ్లు’ ట్రూప్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసేవారికి అవగాహన కల్పిస్తూ దీనిని రూపొందించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో దీనిని ఎంపిక చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి బహుమతి అందజేశారు.

News November 15, 2025

చనిపోయే ముందు భార్యకు ఫోన్ చేసిన సతీశ్.?

image

మాజీ AVSO సతీశ్ హత్య కేసును గుత్తి రైల్వే పోలీసులు తాడిపత్రికి బదిలీ చేశారు. చనిపోయిన రోజు రాత్రి సతీశ్ తన <<18293157>>భార్యకు<<>> 1.20 గం.కు ఫోన్ చేసినట్లు సమాచారం. 4సార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో ‘డిస్ కంఫర్ట్’గా ఉందని వాట్సాప్ మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకు ఆయన ఈమెసేజ్ చేశారన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. సతీశ్ మృతదేహం గుర్తించిన స్పాట్‌కు CID డీజీ రవిశంకర్ అయ్యన్నార్, DIG షిమోషి, SP చేరుకున్నారు.