News April 6, 2024

భద్రాద్రి జిల్లాలో యాక్సిడెంట్.. తల్లీబిడ్డలు మృతి

image

భద్రాద్రి జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. దమ్మపేట వద్ద గుర్తుతెలియని వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 18, 2025

KMM: కల్లూరులో ఎక్కువ.. సింగరేణిలో తక్కువ

image

ఖమ్మం జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 90.72 శాతం పోలింగ్‌తో కల్లూరు ముందు వరుసలో ఉంది. వేంసూరు 90.63%, ఏన్కూరు 89.50%,పెనుబల్లి 88.98%,తల్లాడలో 88.14%,సత్తుపల్లిలో 87.36%, సింగరేణిలో 87.29% శాతం పోలింగ్ నమోదైంది. 7 మండలాల్లో జరిగిన 3వ విడతలో 2,43,983 లక్షల ఓటర్లుండగా, వారిలో 2,16,765 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News December 18, 2025

ఖమ్మం: మూడో దశ పోరులో పైచేయి ఎవరిదంటే?

image

● సత్తుపల్లి(21 స్థానాలు): CON- 16, BRS- 4, TDP- 1
● ఏన్కూర్(20): CON- 16, BRS- 3, ఇతరులు- 1
● తల్లాడ(27): CON- 19, BRS- 6, CPM- 1, ఇతరులు- 1
● కల్లూరు(23): CON- 8, BRS- 11, ఇతరులు- 4
● సింగరేణి(41): CON- 32, BRS- 2, CPI- 1, ఇతరులు- 6
● పెనుబల్లి(32): CON- 23, BRS- 8, ఇతరులు- 1
● వేంసూరు(26): CON- 15, BRS- 10, CPM- 1.

News December 17, 2025

జైత్రం తండా సర్పంచ్‌గా జయంతి

image

సింగరేణి మండలంలోని జైత్రం తండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి మూడ్‌ జయంతి విజయకేతనం ఎగురవేశారు. బుధవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన మెజారిటీతో ఘనవిజయం సాధించి సర్పంచ్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. జయంతి విజయం సాధించడంతో తండాలో గులాబీ శ్రేణులు బాణసంచా కాల్చి, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.