News March 14, 2025
భద్రాద్రి జిల్లాలో రేపటి నుంచే ఒంటి పూట బడులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా శనివారం(రేపటి) నుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్స్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటి పూట బడులు పక్కాగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు.
Similar News
News February 8, 2026
కమ్మర్పల్లి: ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడలు

కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం 8వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్-2026 పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ గడ్డం నగేశ్, సర్పంచ్ కొత్తపల్లి హారిక పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో పట్టుదల, కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చని అన్నారు. క్రీడాలు ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రతి విద్యార్థి పాల్గొనాలని కోరారు.
News February 8, 2026
సంక్రాంతి రేసులో టాలీవుడ్ ‘ఫోర్ పిల్లర్స్’!

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ను టాలీవుడ్కి నాలుగు పిల్లర్లుగా చెబుతుంటారు. వచ్చే సంక్రాంతికి వీరంతా బాక్సాఫీసు వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. చిరు-బాబీ, బాలయ్య-గోపీచంద్ మలినేని, నాగార్జున-కళ్యాణ్ కృష్ణ, వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమాలు పొంగల్ పోరుకు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఏ పుంజు చివరి వరకు బరిలో ఉంటుంది? ఏది రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
News February 8, 2026
ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా మైసూరుకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్ధం ఉమ్మడి కృష్ణా మీదుగా CCT(కాకినాడ టౌన్)- మైసూరు(MYS) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07033 CCT- MYS రైలు మార్చి 2 నుంచి 30 వరకు ప్రతి సోమ, శుక్రవారం, నం.07034 MYS- CCT రైలు మార్చి 3 నుంచి 31 వరకు ప్రతి మంగళ, శనివారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.


