News February 21, 2025
భద్రాద్రి జిల్లాలో 36 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వసిద్ధం చేయాలని కలెక్టర్ జీతేవ్ వి పాటిల్ అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 36 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు మొదటి సంవత్సరంలో 9,225 మంది, రెండో సంవత్సరంలో 10,003 మంది విద్యార్థులు హజరవుతారన్నారు. మార్చి 5 నుంచి 25 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుతాయన్నారు.
Similar News
News February 24, 2026
మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే..

శివునికి అంకితం చేసిన ఈ మంత్రం అతి శక్తిమంతమైనది. దీనిని ‘మృత్యువును జయించే మంత్రం’ అంటారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. అకాల మృత్యు భయం పోవడానికి, త్వరగా కోలుకోవడానికి, శివుని రక్షణ పొందడానికి దీనిని పఠిస్తుంటారు.
మంత్రం: ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్| ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్||
News February 24, 2026
30 లక్షల ఇళ్లపై సోలార్ వెలుగులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘PM సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు అద్భుతమైన స్పందన వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30 లక్షల గృహాల్లో రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ ఘనతపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్ ఇంధన భద్రత, స్వయం సమృద్ధి దిశగా వేసిన కీలక అడుగు అని కొనియాడారు.
News February 24, 2026
DMK కూటమిలో సీట్ల సెగ.. 45 స్థానాలకు కాంగ్రెస్ పట్టు?

తమిళనాడు ఎన్నికల వేళ అధికార DMK నేతృత్వంలోని కూటమిలో సీట్ల గొడవ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 45 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో DMK ఓడిపోయిన స్థానాల్లో కనీసం 20 చోట్ల తమకు బలం ఉందని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. CM స్టాలిన్ మాత్రం కాంగ్రెస్కు 25 సీట్లకు మించి ఇచ్చేందుకు ఇష్టపడటం లేదట. మరోవైపు IUML, MMK చెరో 5 సీట్లు డిమాండ్ చేస్తున్నాయని టాక్.


