News February 10, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

• తల్లితో గొడవపడి భద్రాచలం బాలిక ఆత్మహత్య• రైతు భరోసాకు ఎగనామం పెట్టారు: CPIML• పదో తరగతి విద్యార్థులపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే జారే • పాల్వంచ పెద్దమ్మతల్లి గుడిలో ముగిసిన పూజలు • సేవాలాల్ జయంతి పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ • ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు: అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్• బూర్గంపాడులో యథేచ్ఛగా ఇసుక రవాణా • గుండాలలో యువకుడి మృతి

Similar News

News November 20, 2025

ఎన్టీఆర్: పత్తి రైతులపై సీసీఐ నిర్లక్ష్యం

image

ఎన్టీఆర్ జిల్లాలో సీసీఐ ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఏ కేంద్రంలోనూ కొనుగోలు జరగక రైతులు ఆందోళన చెందుతున్నారు. కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, ఏ.కొండూరు, గంపలగూడెంలో కేంద్రాలు ఉన్నప్పటికీ అధికారులు పత్తి తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.7,710 – 8,110గా ఉన్నా దళారుల చేత తక్కువకు కొనిపించి లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

News November 20, 2025

వేములవాడ: డ్రైనేజీలో పడి యువకుడి మృతి

image

వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డు ప్రాంతంలోని బతుకమ్మ తెప్ప వద్ద గల ప్రధాన డ్రైనేజీలో పడిపోయి ఓ యువకుడు మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి అనంతరం ద్విచక్రవాహనం అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున డ్రైనేజీలో ద్విచక్ర వాహనాన్ని, యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతి చెందిన యువకుడు స్థానిక బద్ది పోచమ్మ ఆలయంలో తాత్కాలిక పద్ధతిన పని చేస్తాడని తెలుస్తోంది.

News November 20, 2025

నేడే ఫెస్ట్.. HYD వస్తున్న ఉత్తర, తూర్పు భారత ప్రజలు

image

ఉత్తర, తూర్పు భారతదేశ నలు మూలల నుంచి గౌరవనీయ ప్రతినిధులు తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో, కల్చరల్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు HYD చేరుకుంటున్నారు. రాజ్‌భవన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ విశిష్టోత్సవం నేడు ప్రారంభం కానుంది. సాంకేతికతతో పాటు సంస్కృతిని కలగలిపే ఈ వేడుకలో తాజా అప్డేట్స్‌ కోసం వేచి ఉండండి.