News February 22, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ పాల్వంచ: రూ.26 లక్షలు చోరీ.. నిందితులు అరెస్ట్ ✓ అకాల వర్షాలతో మిర్చి పంటకు నష్టం ✓ ఇల్లందు రోడ్డు ప్రమాదంలో మహిళలకు తీవ్ర గాయాలు ✓ మణుగూరులో ఐటీడీఏ పీవో ఆకస్మిక పర్యటన ✓ KTRను కలిసిన మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు ✓ చర్ల: తునికాకు సరైన ధర నిర్ణయించాలి: CPIML ✓ జూలూరుపాడు గిరిజనుడి 7 ఎకరాల భూమి కబ్జా: ఆదివాసీలు ✓ కేసుల విషయంలో జాప్యం చేస్తే సహించేది లేదు: ఎస్పీ.

Similar News

News December 4, 2025

శ్రీరాంపూర్: ఈ నెల 8న అప్రెంటిస్ట్ మేళా

image

ఈ నెల 8న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ శ్రీరాంపూర్ ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. అప్రెంటిషిప్ మేళాలో మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఫ్రెండ్షిప్ మేళాలో పాల్గొనాలన్నారు. అర్హత గలవారు www.apprenticeshipindia.gov.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

News December 4, 2025

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి గురువారం ఆలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవాలను విజయవంతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News December 4, 2025

సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

image

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.