News February 22, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పాల్వంచ: రూ.26 లక్షలు చోరీ.. నిందితులు అరెస్ట్ ✓ అకాల వర్షాలతో మిర్చి పంటకు నష్టం ✓ ఇల్లందు రోడ్డు ప్రమాదంలో మహిళలకు తీవ్ర గాయాలు ✓ మణుగూరులో ఐటీడీఏ పీవో ఆకస్మిక పర్యటన ✓ KTRను కలిసిన మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు ✓ చర్ల: తునికాకు సరైన ధర నిర్ణయించాలి: CPIML ✓ జూలూరుపాడు గిరిజనుడి 7 ఎకరాల భూమి కబ్జా: ఆదివాసీలు ✓ కేసుల విషయంలో జాప్యం చేస్తే సహించేది లేదు: ఎస్పీ.
Similar News
News September 17, 2025
పాలమూరు నిరుద్యోగులకు జాబ్ మేళా

మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగుల కోసం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ కృష్ణ తెలిపారు. ఎస్ఎస్సీ పాసైన 18 నుంచి 35 ఏళ్ల లోపు నిరుద్యోగులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే ఈ జాబ్ మేళా వివరాల కోసం 93981 72724, 63648 67804, 63648 63213 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
SHARE IT
News September 17, 2025
పిట్లం పోరాట యోధులకు జోహార్లు..!

రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు విమోచనం కల్పించడానికి పిట్లం యోధులు ఉప్పు లక్ష్మయ్య, గంగ నాగయ్య, కుమ్మరి లక్ష్మారెడ్డి, నీలకంఠ నారాయణ, లోక లక్ష్మయ్య, కొండ నారాయణ అలుపెరగని పోరాటం చేశారు. వీరి జ్ఞాపకార్థం 1975లో పిట్లంలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ యోధులకు నివాళులర్పిస్తూ, వారి వారసులు ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఈ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, వారి త్యాగాలను స్మరించుకుంటారు.
News September 17, 2025
ఖమ్మం: సాయుధపోరు.. 900 మంది అమరులయ్యారు

రజాకార్ల అరాచకాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎదురొడ్డి నిలిచింది. సాయుధ, శాంతిపోరులో ఎంతోమంది పాల్గొన్నారు. జమలాపురం కేశవరావు రగిలించిన పోరాట స్ఫూర్తి ఎందరినో ఉద్యమం వైపు నడిపింది. జమలాపురం కేశవరావు, చిర్రావురి లక్ష్మీనర్సయ్య, మిర్యాల నారాయణగుప్తా, పైడిపల్లి హనుమయ్య, గెల్లా కేశవరావు, మంచికంటి రాంకిషన్రావు, లింగం గుప్తా, దాశరథి సోదరులతో పాటు మరెందరో ఉన్నారు. సుమారు 900 జిల్లా వాసులు అమరులయ్యారు.