News March 7, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ భద్రాద్రి రాములోరి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ✓ చండ్రుగొండలో ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డీఎస్పీ ✓ గుండాలలో ఘనంగా పగిడిద్దరాజు జాతర ✓ సుజాతనగర్లో జూనియర్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ✓ దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జిగా భవాని ✓ భద్రాచలం జడ్జి వినూత్న తీర్పు.. ముద్దాయిలతో హాస్టల్ పరిసరాలు శుభ్రం ✓ ఈనెల 9న సుజాతనగర్లో కాసాని ఐలయ్య సంస్మరణ సభ.

Similar News

News November 4, 2025

ఆదిలాబాద్: ‘పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యం రిజిస్ట్రేషన్’

image

పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యం రిజిస్ట్రేషన్ తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉద్యం రిజిస్ట్రేషన్‌పై ఒక రోజు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, పరిశ్రమల శాఖ జీఎం.పద్మభూషణ్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఉత్పల్ కుమార్, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

News November 4, 2025

సంతబొమ్మాళి: ‘చిన్నారులకు ఇస్తున్న వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం తగదు’

image

చిన్నారులకు క్రమం తప్పకుండా ఇస్తున్న వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం తగదని DyDMHO డాక్టర్ మేరీ కేథరిన్ అన్నారు. సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించి పీహెచ్సీ సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. క్రమం తప్పకుండా చిన్నారులకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 4, 2025

త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్‌బీఐ

image

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ లాభాలను నమోదు చేసింది. ఈ FYలో సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే(రూ.18,331 కోట్లు) 10% వృద్ధి సాధించింది. నికర వడ్డీ ఆదాయం 3% పెరిగి రూ.42,985 కోట్లకు చేరింది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.1,19,654 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో SBI షేర్లు స్వల్పంగా లాభపడి రూ.954.6 వద్ద ముగిశాయి.