News March 7, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ భద్రాద్రి రాములోరి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ✓ చండ్రుగొండలో ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డీఎస్పీ ✓ గుండాలలో ఘనంగా పగిడిద్దరాజు జాతర ✓ సుజాతనగర్లో జూనియర్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ✓ దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జిగా భవాని ✓ భద్రాచలం జడ్జి వినూత్న తీర్పు.. ముద్దాయిలతో హాస్టల్ పరిసరాలు శుభ్రం ✓ ఈనెల 9న సుజాతనగర్లో కాసాని ఐలయ్య సంస్మరణ సభ.
Similar News
News March 17, 2026
ఫోన్ పోయిందా అయితే ఇలా చేయండి: VZM ఎస్పీ

మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనం జరిగినా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి లేదా ఆన్లైన్లో CEIR పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి మొబైల్ ట్రాకింగ్ చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. ప్రజలు తమ మొబైల్ IMEI నంబర్ను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.
News March 17, 2026
NGKL: పర్యావరణ పరిరక్షణ.. 4 గ్రామాల తరలింపు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్రాబాద్(M) వటువర్లపల్లితో పాటు మరో 4 గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మధ్యప్రదేశ్లోని పన్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ తరలింపు కొనసాగుతోంది. కొత్త గ్రామాల ఏర్పాటుకు, మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, MLA వంశీకృష్ణ, మాజీ డీఎఫ్ఓ రోహిత్ గోపిడికి రీలొకేషన్ కమిటీ అధ్యక్షుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News March 17, 2026
భీమవరం: ‘ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’

రాబోయే వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో భీమవరం కలెక్టరేట్లో సమీక్ష సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రదేశాలను గుర్తించి అక్కడ తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.


