News March 19, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పోడు రైతులకు జిల్లా కలెక్టర్ శుభవార్త ✓ గోదావరి ప్రాంత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పాయం ✓ అసెంబ్లీలో బీసీ, ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పట్ల జిల్లా వ్యాప్తంగా సంబరాలు ✓ సైబర్ నేరాలపై టేకులపల్లిలో అవగాహన ✓ అశ్వారావుపేటలో కబేళాకు తరలిస్తున్న మూగజీవాలు పట్టివేత ✓ అశ్వాపురం అడవుల్లో ఆగని మంటలు ✓ ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం: మాల మహానాడు ✓సీఎంతో భేటీ అయిన గుమ్మడి నరసయ్య.
Similar News
News October 24, 2025
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పాము కలకలం

భద్రాద్రి కలెక్టర్ క్యాంపు ఆఫీసులో శుక్రవారం పాము కనిపించడంతో సిబ్బంది స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్కు సమాచారం అందించారు. సంతోష్ సురక్షితంగా పామును పట్టుకుని బంధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అతన్ని అభినందించి, రక్షణ పరికరాలకు అవసరమైన సహకారం అందిస్తానని తెలిపారు. జిల్లా కేంద్రంలో స్నేక్ రెస్క్యూ ప్రదర్శన శాల ఏర్పాటు అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
News October 24, 2025
HYD: సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం ₹12.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. హైదరాబాద్లో ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరిట వందల మందిని సాహితీ ఇన్ఫ్రా సంస్థ మోసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ పూర్ణచందరరావు, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మొత్తం ₹126 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ విచారణలో తేలింది.
News October 24, 2025
కనీసం వెయ్యి మందితో యూనిట్ మార్చ్ నిర్వహించాలి: కలెక్టర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో భాగంగా ‘యూనిటీ మార్చ్ ఆఫ్ మోడర్న్ ఇండియా’ పోస్టర్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. యువతలో దేశభక్తి, సమైక్యత భావాలను పెంపొందించేలా అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 6 వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కనీసం వెయ్యి మంది యువకులతో యూనిటీ మార్చ్ పాదయాత్రను ఘనంగా చేపట్టాలన్నారు.


