News March 19, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పోడు రైతులకు జిల్లా కలెక్టర్ శుభవార్త ✓ గోదావరి ప్రాంత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పాయం ✓ అసెంబ్లీలో బీసీ, ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పట్ల జిల్లా వ్యాప్తంగా సంబరాలు ✓ సైబర్ నేరాలపై టేకులపల్లిలో అవగాహన ✓ అశ్వారావుపేటలో కబేళాకు తరలిస్తున్న మూగజీవాలు పట్టివేత ✓ అశ్వాపురం అడవుల్లో ఆగని మంటలు ✓ ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం: మాల మహానాడు ✓సీఎంతో భేటీ అయిన గుమ్మడి నరసయ్య.
Similar News
News April 24, 2025
స్విట్జర్లాండ్ వీసా రిజెక్ట్.. మినీ స్విట్జర్లాండ్లో ఉగ్రతూటాకు బలి

ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ ఉదంతంలో మరో హృదయవిదారక అంశం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న అతను హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. వీసా రిజెక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్గా భావించే పహల్గామ్ వెళ్లి ఉగ్రతూటాకు బలయ్యారు. అతడికి చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని ఉండేదని, అందుకే నేవీలో చేరాడని పేరెంట్స్ చెప్పారు.
News April 24, 2025
కర్నూలు జిల్లా టాపర్లు వీరే!

కర్నూలు జిల్లా విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అదరగొట్టారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ఏడుగురు 597 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. కర్నూలుకు చెందిన టి.గాయత్రి, గీతిక, కీర్తన, ఎమ్మిగనూరుకు చెందిన మహ్మద్, ఆదోనికి చెందిన సలీమా, జి.నందు, హరిణి టాపర్ల జాబితాలో ఉన్నారు. ఇక జిల్లాలో మొత్తం 31,185 మంది పరీక్ష రాయగా 20,584 మంది పాసయ్యారు.
News April 24, 2025
VZM: ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు

జిల్లా ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన శ్రీకాకుళంలో RIOగా DOEOగా, మన్యం జిల్లా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఇంటర్ విద్యలో RIO, DOEO పోస్టులను కలిపి జిల్లా ఇంటర్ విద్యా శాఖాధికారి పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు.