News March 31, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ పాల్వంచ పెద్దమ్మ గుడిలో శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం
✓ గిరిజన దర్బార్ రద్దు
✓ ఘనంగా చిలకలగండి ముత్యాలమ్మ జాతర
✓ ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
✓ దుమ్ముగూడెంలో ఇసుక లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
✓ భద్రాచలం బిల్డింగ్ కూలిన ఘటనలో వ్యక్తి అరెస్ట్
✓ గుడుంబా స్థావరాలపై కరకగూడెం పోలీసుల దాడులు
✓ పేరాయిగూడెంలో 5 గుడిసెలు దగ్ధం
✓ భార్య పుట్టింటికి వెళ్లిందని.. మణుగూరులో భర్త ఆత్మహత్య

Similar News

News February 27, 2026

358 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. మొత్తం 5,069 మంది విద్యార్థులకు గానూ 4,711 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

News February 27, 2026

ఏపీకి మరో కంపెనీ.. వివరాలివే

image

AP: జపాన్‌కు చెందిన ప్రొటీరియల్ కంపెనీ రాష్ట్రానికి రానుంది. తిరుపతిలోని శ్రీసిటీలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఇందులో ట్రాన్స్‌ఫార్మర్లలో ఉపయోగించే అమోర్ఫస్ మెటల్‌ను ఉత్పత్తి చేయనుంది. తొలి దశలో $77 మిలియన్లను పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ పూర్తయ్యాక ఏడాదికి 30వేల టన్నులు ఉత్పత్తి చేయనుంది. జపాన్, యూఎస్ తర్వాత అమోర్ఫస్ మెటల్ కోసం ఏర్పాటయ్యే మూడో ప్లాంట్ ఇదే కావడం విశేషం.

News February 27, 2026

వనపర్తి: అదనపు కలెక్టర్‌గా ఖీమ్యా నాయక్ బాధ్యతలు

image

వనపర్తి జిల్లా నూతన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఖీమ్యా నాయక్ ఐఏఎస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, వేగానికి ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.