News April 9, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓అశ్వాపురం ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో✓పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి:CPM✓జూలూరుపాడులో బైక్ ను ఢీ కొట్టిన కారు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు✓వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి: మైనారిటీ సెల్ ✓సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే పాయం ✓నాటు తుపాకులతో ఉన్న వ్యక్తులను అదుపులో తీసుకున్న అశ్వారావుపేట పోలీసులు

Similar News

News November 8, 2025

బైక్ కొనాలనుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోండి!

image

రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. 2026 నుంచి కొనుగోలు చేసే టూవీలర్లకు ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉండాల్సి ఉంటుంది. అలాగే డీలర్‌లు వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్స్ అందించాలి. రైడర్ & పిలియన్ హెల్మెట్ ధరించాలి. లేకపోతే రూ.వేలల్లో ఫైన్స్ విధించొచ్చు.

News November 8, 2025

బండి సంజయ్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

image

కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ‘దొంగ’ అని సంబోధించడంపై పీసీసీ ఎన్నికల కో కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. కాంగ్రెస్ గెలిస్తే ఉన్న బంగారం కూడా తీసుకెళ్తారని బండి సంజయ్ జూబ్లిహిల్స్ ప్రచారంలో పేర్కొన్నారు.

News November 8, 2025

సంగారెడ్డి: 13 తేదీ లోపు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి: డీఈఓ

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 13 తేదీ లోపు స్కూల్ HMలకు పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. HMలు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14లోపు ఫీజు చెల్లించాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18 లోపు డీఈవో కార్యాలయంలో అందించాలని అన్నారు. ఈ విషయాన్ని అన్ని రకాల పాఠశాలల హెచ్ఎంలు గమనించాలని పేర్కొన్నారు.