News February 14, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ భద్రాద్రి: 19 మంది మావోయిస్టుల లొంగుబాటు ✓ యథేచ్చగా పంచాయతీ ఎన్నికలు జరపాలి: కలెక్టర్ ✓ భద్రాద్రిలో విషాదం.. ఇద్దరి దుర్మరణం ✓ అశ్వారావుపేటలో విద్యార్థులతో వెట్టిచాకిరి ✓ చిరుమళ్ల వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం ✓ ఇల్లందు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ✓ కొత్తగూడెంలో యథేచ్చగా ప్రభుత్వ భూముల కబ్జా ✓ బూర్గంపాడు: కారు, బైక్ ఢీ.. ✓ పర్ణశాలలో ఔషధ మోక్కలు నాటాలి: కలెక్టర్.
Similar News
News November 11, 2025
ఖమ్మం: కౌలు రైతులు పత్తి విక్రయానికి నమోదు చేసుకోవాలి: కలెక్టర్

కౌలు రైతులు మద్దతు ధరకు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవడానికి అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. దళారుల జోక్యం లేకుండా కౌలు రైతులు నేరుగా పత్తి విక్రయం చేయగలరని చెప్పారు. ఇందుకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తమ వివరాలను నమోదు చేసుకొని, అనంతరం సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని సూచించారు.
News November 11, 2025
9 మంది యువకులపై బైండోవర్ కేసులు

కదిరిలో గంజాయి తాగుతున్న యువకులపై దాడులు చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం వీరిపై బైండ్ ఓవర్ కేసులు నమోదుచేసి తల్లిదండ్రుల ముందు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. మంగళవారం తహశీల్దార్ ముందు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఫైన్ విధించి, బైండ్ ఓవర్ చేయనున్నట్లు వివరించారు. గంజాయిని వాడే 17 ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. ఓటేస్తేనే అడిగే హక్కు..!

భారత రాజ్యాంగం మనకు ఓటు అనే వజ్రాయుధాన్ని ఇచ్చింది.. దానిని మీ వద్దే ఉంచుకుంటే ఎలా? ఇప్పుడు బయటకు తీయండి. మా ఏరియాలో ఆ సమస్యలు ఉన్నాయి.. ఈ సమస్యలున్నాయి.. ఎవరూ పట్టించుకోరు అని చాలా మంది నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు కూడా అలా చేసి ఉంటారు. ఇటువంటి ఎన్నికల సమయంలో మీరు మంచి నాయకుడిని ఎన్నుకోండి.. లేకపోతే సమస్యలు అలాగే ఉండిపోతాయి.. మనల్ని పట్టించుకునే వారే ఉండరు. ఓటేసేందుకు కదలిరండి.


