News February 16, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ దుమ్ముగూడెంలో షార్ట్ సర్క్యూట్‌.. 3 ఇళ్లు దగ్ధం ✓ సీసీ కెమెరాల ఏర్పాటు పై అవగాహన కల్పించాలన్న భద్రాద్రి ఎస్పీ ✓ ఎడ్ల బండిపై ప్రయాణించిన భద్రాద్రి కలెక్టర్ ✓ బూర్గంపాడు: ఈనెల 20న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి: CPIML ✓ పాల్వంచలో మీసేవ కేంద్రాల ఆకస్మిక తనిఖీ ✓ గిరిజనుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలి: ఐటీడీఏ పీవో ✓ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు.

Similar News

News March 23, 2025

నెల రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ

image

SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని నెల దాటింది. అయినా ఇప్పటివరకు ఒకరి మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడంలేదు. దీంతో సహాయక చర్యలపై NDRF, SDRF, ఆర్మీ తదితర విభాగాలతో TG CM రేవంత్ రెడ్డి రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది.

News March 23, 2025

ఆదిలాబాద్‌: రేపటి నుంచి 6రోజుల పాటు శిక్షణ

image

ఆదిలాబాద్‌లోని TTDCలో విపత్తు నిర్వహణపై ఈ నెల 24 నుంచి 29 వరకు మర్రి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18 నుంచి 40 సం.రాల వయస్సు లోపు పది పాసైన 50 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టిఫిన్, భోజనం ఖర్చులకు వంద రూపాయలతో పాటు రాత్రి వసతి కూడా ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

News March 23, 2025

కరప: భర్త, ఇద్దరు కొడుకులు చనిపోవడంతో మహిళ సూసైడ్ 

image

కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన బరగటి లక్ష్మి (59) ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి సంతానం. 2019లో భర్త, 2021లో చిన్న కొడుకు, 2023లో పెద్దకొడుకు, 2024లో అల్లుడు చనిపోయారు. ఆమె ఒంటరిగా వేలంగిలో ఉంటోంది. మనస్తాపం చెంది ఆమె శనివారం తుల్యభాగలో దూకి మరణించిందని ఆమె మనవడు పోతురాజు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని వెలికి తీసి కరప ఎస్ఐ సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!