News March 22, 2025

భద్రాద్రి: తండ్రి మరణం.. ఆ ఇద్దరు బిడ్డలకు ‘పరీక్ష’

image

ఓ వైపు తండ్రి మరణం.. మరో వైపు ‘పది’ పరీక్షలు. ఆ పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాశారు ఇల్లందు మండలం కల్తిరామయ్యగుంపు గ్రామానికి చెందిన బి.వీరాస్వామి కుమార్తెలు. వీరాస్వామి గురువారం అనారోగ్యంతో మృతి చెందగా, మరణ వార్త దిగమింగుకొని పదో తరగతి పరీక్షలు రాశారు హర్షిత, ప్రియ. పరీక్ష అనంతరం తండ్రిని కడసారి చూసిన కుమార్తెలు విలపిస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. దుఃఖంలోనూ పరీక్ష రాసిన వారు గ్రేట్ కదా..!

Similar News

News December 6, 2025

చెన్నూర్: గెలిపిస్తే.. ఉచిత అంబులెన్స్, పెళ్లికి రూ.5000

image

చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సర్పంచ్ అభ్యర్థి దుర్గం అర్చన సంతోశ్ వినూత్న మేనిఫెస్టోతో ప్రచారం చేస్తున్నారు. ఉచిత అంబులెన్స్, ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూ.5,000 ఆర్థిక సాయం, సెంట్రల్ లైటింగ్ సిస్టంతో సహా 15 రకాల హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. హామీలను నమ్ముతూ ప్రజలకు బాండ్లు రాసి ఇస్తున్నారు.

News December 6, 2025

HYDలో పెరిగిన పాదచారుల ‘రోడ్‌కిల్’

image

HYDలో ఫుట్‌పాత్‌ల లేమి, ఆక్రమణల కారణంగా పాదచారుల మరణాలు పెరుగుతున్నాయి. 2024లో సుమారు 400 మంది మరణించగా, 1,032 ప్రమాదాలు జరిగాయి. 2025లో ఇప్పటి వరకు 510 మరణాలకు ఇదే కారణం. ఐటీ కారిడార్లలో సైతం కిలోమీటరుకు సగటున 7 అడ్డంకులు ఉండటంతో ఉద్యోగులు నడవలేకపోతున్నారు. 7,500 స్టాల్స్ తొలగించినా, సమస్య పరిష్కారం కాలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

News December 6, 2025

అంబేడ్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

*విదేశాల్లో ఎకనామిక్స్‌లో PhD చేసిన తొలి భారతీయుడు
*కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పాలిటిక్స్‌లో 3 కోర్సులు చేశారు
*1935లో ఆర్బీఐ ఏర్పాటులో కీలకపాత్ర
*అంబేడ్కర్ పర్సనల్ లైబ్రరీలో 50వేల పుస్తకాలు ఉండేవి
*దేశంలో పనిగంటలను రోజుకు 14 గం. నుంచి 8 గం.కు తగ్గించారు
>ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి