News January 22, 2025

భద్రాద్రి: దివ్యాంగులకు ఆర్థిక పునరావాస కోసం దరఖాస్తులు

image

2024-25 సంవత్సరానికి గాను దివ్యాంగులు.. ఆర్థిక పునరావాస పథకం ద్వారా స్వయం ఉపాధి, పునరావాసం, చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు పెట్టుకోవాలనుకునే వారికి నాన్ బ్యాంక్ లింకేజీ యూనిట్ల కోసం అన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల దివ్యాంగులు ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 2 తేదీ వరకు https:tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News December 6, 2025

నిఘాలో తూర్పు గోదావరి

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందేలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.

News December 6, 2025

విశాఖ నుంచి వెళ్లవలసిన పలు విమానాలు రద్దు

image

విశాఖ నుండి వెళ్ళవలసిన పలు విమానాలు రద్దు అయినట్టు శనివారం ఉదయం ఇంచార్జి ఏర్పోర్ట్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం తెలిపారు. వాటిలో ఇండిగో సంస్థకు చెందిన 6E 217 / 6E 218 BLR – VTZ – BLR, 6E 5248 / 6E 845 BOM – VTZ – MAA, 6E 557 / 6E 6585 MAA – VTZ – BOM ఆపరేషన్ రీజనల్ కారణంగా రద్దయినట్లు తెలిపారు. వీటితో పాటు మరో 9 విమానాలను రద్దు చేశారు.

News December 6, 2025

NZB: ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడండి: MP

image

ప్రభుత్వ టీచర్లకు తప్పని సరి అనే నిబంధనల విషయంలో చాలా ఏళ్లుగా సేవ చేస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ను MP అర్వింద్ ధర్మపురి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఒక వినతిపత్రం అందజేసిన ఎంపీ మాట్లాడుతూ NZBలోక్ సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3వేల మంది ఉపాధ్యాయులపై ఈ టెట్ తప్పనిసరి అంశం ప్రభావం చూపుతోందని వివరించారు.