News March 28, 2025
భద్రాద్రి: నిరుద్యోగులకు 2నెలల శిక్షణకు దరఖాస్తులు

గిరిజన నిరుద్యోగులకు రెండు నెలలపాటు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కోర్స్ డైరెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు ITI, డిప్లొమా, పదో తరగతి ఆపైన చదివిన వారు ఏప్రిల్ 1 లోపు పాల్వంచ పట్టణంలోని టెక్ షోర్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్లో అప్లై చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం ఫోన్ 94911 09068కు కాల్ చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News November 16, 2025
బీజేపీకి ఓటు వేస్తేనే హిందువులా?.. MLAపై నెటిజన్ల ఫైర్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఓడిపోయాం అంతే చచ్చిపోలేదు. బీజేపీకి ఓటు వేసిన 17,056 మంది కట్టర్ హిందూ బంధువులకు ధన్యవాదాలు. కనీసం మీరైనా హిందువులుగా బతికి ఉన్నందుకు గర్వపడుతున్నా. జై హిందుత్వ’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తేనే హిందువులా.. ఓటు వేయకుంటే హిందువులు కాదా? అని నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.
News November 16, 2025
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన ఇషా

ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్ కాంస్యంతో మెరిసింది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో ఇషా 30 పాయింట్లు సాధించి 3వస్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్లో 587 పాయింట్లు సాధించి అయిదో స్థానంతో ఫైనల్కు వచ్చిన ఇషా తుదిపోరులో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఈ ఛాంపియన్షిప్లో ఇషాకు ఇదే తొలివ్యక్తిగత పతకం. ఈ ఏడాది ప్రపంచకప్ స్టేజ్ టోర్నీలో ఆమె స్వర్ణం, రజతం సాధించింది.
News November 16, 2025
శంషాబాద్: విమానంలో స్మోకింగ్ చేసిన ప్రయాణికుడు

విమానంలో పొగ తాగిన ప్రయాణికుడిని ఎయిర్ లైన్స్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాలు.. రియాద్ నుంచి ఇండిగో విమానంలో శనివారం ఓ ప్రయాణికుడు శంషాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగినట్లు ఎయిర్లైన్స్ సిబ్బంది గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


