News October 9, 2024

భద్రాద్రి: పర్యావరణానికి ఉపయోగపడే మొక్కలను పెంచాలి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలోని నర్సరీలో పర్యావరణానికి,ఆయుర్వేదంగా ఉపయోగపడే మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైన మొక్కలను జిల్లాలోని అన్ని కెనాల్ రెండు వైపులా నాటే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఖాళీ స్థలాల్లో సైతం మొక్కలు పెంచాలన్నారు.

Similar News

News December 10, 2025

మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

image

డిసెంబర్ 11న జరిగే మొదటి దశ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలోని 7మండలాల పరిధిలో 172పంచాయతీలు, 1,740వార్డులలో పోలింగ్ జరుగుతుంది. అనంతరం అదే కేంద్రాల్లో ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 2,41,137మంది ఓటర్లు ఉండగా, 20 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 360క్రిటికల్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 162సెన్సిటివ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.

News December 10, 2025

‘పోలింగ్ రోజున వేతనముతో కూడిన సెలవు’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. SEC, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల యజమానులు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు ఏ విధంగానూ జీతం కట్ చేయవద్దన్నారు.

News December 10, 2025

‘పోలింగ్ రోజున వేతనముతో కూడిన సెలవు’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. SEC, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల యజమానులు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు ఏ విధంగానూ జీతం కట్ చేయవద్దన్నారు.