News October 9, 2024
భద్రాద్రి: పర్యావరణానికి ఉపయోగపడే మొక్కలను పెంచాలి: కలెక్టర్
భద్రాద్రి జిల్లాలోని నర్సరీలో పర్యావరణానికి,ఆయుర్వేదంగా ఉపయోగపడే మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైన మొక్కలను జిల్లాలోని అన్ని కెనాల్ రెండు వైపులా నాటే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఖాళీ స్థలాల్లో సైతం మొక్కలు పెంచాలన్నారు.
Similar News
News October 10, 2024
ఖమ్మం: ప్రత్యేక ఆకర్షణగా 51 అడుగుల బతుకమ్మ
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కూసుమంచి మండలం పరిధిలోని పెరిక సింగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ఆధ్వర్యంలో తయారుచేసిన 51 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి ఏటా ఈ గ్రామంలో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరుగుతాయి. గురువారం సాయంత్రం జరగబోయే బతుకమ్మ వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని జూకూరి గోపాలరావు తెలిపారు.
News October 10, 2024
KMM: సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
సద్దుల బతుకమ్మ పండుగను ఈరోజు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సెంటర్లు, కాలనీలు, ఆలయాల్లో మహిళలు ఘనంగా జరుపుకోనున్నారు. ఇందు కోసం మున్సిపల్ శాఖ ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ ఆడే కూడళ్ల వద్ద విద్యుత్ లైట్లను అమర్చారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు బుధవారం సర్దార్ పటేల్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
News October 10, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
> నేటి నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవులు
> ఖమ్మం, రఘునాథపాలెం మండలాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
> అశ్వరావుపేట మండలం వినాయకపురం ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ
> భద్రాచలం: విజయలక్ష్మి అవతారంలో దుర్గాదేవి
> ఖమ్మం టూ టౌన్లో సీపీఎం శాఖ సమావేశం
> ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన