News January 23, 2025
భద్రాద్రి: పేరెంట్స్ మందలించారని కుమారుడి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దుమ్ముగూడెం మండలం చిన్న బండిరేవు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. గ్రామానికి చెందిన వసంత రెడ్డి(22) ఇంటి వద్ద ఉంటున్నాడు. ఏదైనా పని చేయమని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News November 14, 2025
దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు పంట దిగుబడిని, కాపుకొచ్చిన కాయల నాణ్యతనూ తగ్గిస్తోంది. తెగులుకు కారణమయ్యే బ్యాక్టీరియా.. మొక్క ఆకులు, రెమ్మలు, కాయలపైన మచ్చలు కలగజేస్తుంది. ఈ తెగులుకు గురైన మొక్క ఆకులు రాలిపోవడం, కొమ్మలు విరిగిపోవడం జరుగుతుంది. కాయలపై ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు గరుకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యభాగంలో కాయలపై పగుళ్లు ఏర్పడి మార్కెట్కు పనికిరాకుండాపోతాయి.
News November 14, 2025
దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణ

తెగులు ఆశించిన కొమ్మలను, కాయలను కత్తిరించి నాశనం చేయాలి లేదా కాల్చివేయాలి. తోటలో చెట్ల పాదుల్లో ఎకరాకు 8-10KGల బ్లీచింగ్ పౌడరును చల్లాలి. మొక్కలలో తెగులు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి బ్లైటాక్స్ 3గ్రా.+ స్ట్రెప్టోసైక్లిన్ 0.2గ్రా కలిపి మొక్క బాగాలు తడిచేటట్లు స్ప్రే చేయాలి. ఈ మందులు పిచికారీ చేసిన వారం, 10 రోజుల తర్వాత కాసుగామైసిన్ (లీటరు నీటికి 3ml)ను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
News November 14, 2025
పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ అనుమానాస్పద మృతి

TTD పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు, మాజీ AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. తాడిపత్రి వద్ద రైల్వేట్రాక్పై ఆయన మృతదేహాన్ని గుర్తించారు. సతీశ్ ఫిర్యాదుతో Sr Asst రవికుమార్పై 2023 మేలో విజిలెన్సు ఛార్జిషీట్ దాఖలు చేయగా, లోక్అదాలత్లో రాజీతో ఆయన TTDకి కొన్ని ఆస్తులు అప్పగించారు. దీనిపై పిటిషన్ దాఖలు కాగా హైకోర్టు ఆదేశాలతో CID విచారిస్తోంది. కేసులో YCP నేతలపై TDP ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.


