News February 1, 2025
భద్రాద్రి: బాధితురాలి కోసం జడ్జి వచ్చారు..!

సాధారణంగా కోర్టులో జడ్జి ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. కానీ భద్రాచలం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం జడ్జే బాధితురాలి వద్దకు వచ్చి మానవత్వం చాటుకున్నారు. ఒక చెక్ బౌన్స్ కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సిన ఉరిమెళ్ల పద్మావతి అనే మహిళ అనారోగ్యంతో మెట్లెక్కే స్థితిలో లేదు. విషయం తెలుసుకున్న జడ్జి వి.శివ నాయక్ మొదటి అంతస్తులో ఉన్న కోర్టు నుంచి దిగి ఆమె వద్దకు స్వయంగా వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు.
Similar News
News October 31, 2025
GNT: తెలుగులో ఏపీ రాజకీయ చరిత్ర రచించిన గొప్ప వ్యక్తి

రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు తెలుగులో రచించిన నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబర్ 31న చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించారు. ప్రముఖ హ్యూమనిస్ట్ ఎం.ఎన్. రాయ్ రచనలు ఆయన తెలుగులో అనువదించగా, తెలుగు అకాడమీ వీటిని ప్రచురించింది. తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించారు. ఈయన జాతీయ హేతువాద సంఘంకి కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1954 నుంచి పదేళ్ల పాటు “ప్రజావాణి” పత్రికలో పనిచేశారు.
News October 31, 2025
మంత్రివర్గంలోకి మరో ఇద్దరు!

TG: రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ ఇవాళ మ.12.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. DEC తర్వాత మరో ఇద్దరు క్యాబినెట్లో చేరుతారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. దీనిపై CM రేవంత్ రెడ్డి, అధిష్ఠానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణను అడ్డుకునేందుకు BJP ప్రయత్నిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్లో BRSను గెలిపించడమే ఆ పార్టీ లక్ష్యమని మహేశ్ ఆరోపించారు.
News October 31, 2025
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ద్రాక్ష

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో ద్రాక్ష పండు సాయపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే పాలీఫెనాల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు అవి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడుతుందని గుర్తించారు.


