News February 1, 2025
భద్రాద్రి: బాధితురాలి కోసం జడ్జి వచ్చారు..!

సాధారణంగా కోర్టులో జడ్జి ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. కానీ భద్రాచలం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం జడ్జే బాధితురాలి వద్దకు వచ్చి మానవత్వం చాటుకున్నారు. ఒక చెక్ బౌన్స్ కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సిన ఉరిమెళ్ల పద్మావతి అనే మహిళ అనారోగ్యంతో మెట్లెక్కే స్థితిలో లేదు. విషయం తెలుసుకున్న జడ్జి వి.శివ నాయక్ మొదటి అంతస్తులో ఉన్న కోర్టు నుంచి దిగి ఆమె వద్దకు స్వయంగా వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు.
Similar News
News November 14, 2025
టీచర్లందరికీ టెట్ కంపల్సరీ.. విద్యాశాఖ ఉత్తర్వులు

తెలంగాణలో ఇకపై ఇన్-సర్వీస్ టీచర్లు కూడా <<18277875>>టెట్<<>> క్వాలిఫై అయి ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్లు సర్వీస్లో ఉండాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యాశాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 2009 తర్వాత నియమితులైన 30 వేల మంది టీచర్లకు ఈ నిబంధన వర్తించనుంది. రానున్న 2 ఏళ్లలో వీరంతా టెట్ పాస్ కావాలని అధికారులు తెలిపారు.
News November 14, 2025
తెలంగాణ రౌండప్

* ఈ నెల 17 నుంచి 22 వరకు సర్కారు స్కూళ్లను తనిఖీ చేయనున్న ఉన్నతాధికారులు.. సేఫ్ అండ్ క్లీన్, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించనున్న స్పెషల్ అధికారులు
* చిన్న చిన్న కారణాలతో 2021 నుంచి తొలగించిన 1,300 మంది ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఎండీ నాగిరెడ్డికి కవిత వినతి
* సమ్మె కారణంగా వాయిదా పడిన ఫార్మసీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం..
News November 14, 2025
ఆలు లేత, నారు ముదర అవ్వాలి

ఈ సామెతలో ఆలు అంటే తమలపాకు. అది ఎంత లేతగా ఉంటే అంత రుచిగా, మృదువుగా ఉంటుంది. అలాగే మనిషి కూడా కొన్ని(స్వభావం, మాటతీరు) విషయాల్లో మృదువుగా, సున్నితంగా ఉండాలి. ఇక్కడ నారు అంటే వరి నారు, మొక్కల నారు. అది నాటే సమయానికి ముదురుగా ఉంటేనే మంచి పంట వస్తుంది. అలాగే మనిషి కూడా కొన్ని విషయాల్లో (విలువలు, నిర్ణయాలు, పట్టుదల) దృఢంగా, స్థిరంగా ఉంటే మంచిదని ఈ సామెత అర్థం.


