News February 13, 2025

భద్రాద్రి: బైక్, లారీ ఢీ.. ఒకరు మృతి

image

ఇసుక లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గోగుబాక వద్ద జరిగింది. స్థానికుల వివరాలిలా.. దుమ్ముగూడెం మండలం జడ్ వీరభద్రవరం గ్రామానికి చెందిన కొమరం రాంబాబు బైక్‌పై వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతదేహం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News March 13, 2025

బాపట్ల: మృతురాలి వివరాలు గుర్తింపు

image

బాపట్ల పట్టణంలో లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. బాపట్ల పట్టణ ఎస్ఐ చంద్రావతి పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన శేషమ్మగా గుర్తించినట్లు బాపట్ల పట్టణ ఎస్ఐ చంద్రావతి తెలిపారు. మృతురాలు తన కూతురు వద్దకు వెళుతున్న సమయంలో లారీ ఢీకొనడంతో మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 13, 2025

ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు రష్యాకు US అధికారులు

image

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో కాల్పుల విరమణపై మధ్యవర్తిత్వం చేసేందుకు అమెరికా అధికారులు రష్యా బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు. ‘మా వాళ్లు రష్యాకు వెళ్లే దారిలో ఉన్నారు. ఈ చర్చలకు మాస్కో సహకరిస్తుందని ఆశిస్తున్నాం. అదే జరిగితే 80శాతం మేర ఈ నరమేధం ఆగినట్లే. అలా కాని పక్షంలో రష్యాను కుదేలుచేసే ఆంక్షలు విధించగలను. కానీ అంతవరకూ రాదని అనుకుంటున్నా’ అని స్పష్టం చేశారు.

News March 13, 2025

వనపర్తి: శ్రీ రంగనాయక స్వామి ఆలయ చరిత్ర తెలుసా…!

image

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని 16వ శతాబ్దంలో రాజా బహిరి గోపాలరావు కొరివిపాడు గ్రామంలో శ్రీ రంగనాథ ఆలయంలో నిర్మించాడు. నాటి నుంచి కొరివిపాడు గ్రామం శ్రీరంగాపురంగా ప్రసిద్ధి చెందింది. ఆలయం చుట్టూ శ్రీ రంగసముద్రం అనే పెద్ద చెరువును తవ్వించాడు లక్ష్మీతాయారు దేవాలయాన్ని నిర్మించాడు. రాజరామేశ్వరరావు ధర్మపత్ని శంకరమ్మ 5 అంతస్తుల గోపురాన్ని నిర్మించింది.

error: Content is protected !!