News March 26, 2025

భద్రాద్రి: మహిళా రైతు ఆలోచన అదుర్స్!

image

ఇప్పటి వరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. కానీ అశ్వాపురం మండలం మల్లెలమడుగు వ్యవసాయ పొలంలో దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు మహిళా రైతు పడిదం వరలక్ష్మి ఈ నిఘా నేత్రాన్ని అమర్చారు. పొలంలో కూరగాయలు, విద్యుత్ మోటర్ చోరీకి గురికాకుండా సోలార్‌ కెమెరా ఏర్పాటు చేసినట్లు మహిళా రైతు తెలిపారు. ఈ వినూత్న ఆలోచనను చూసి పలువురు అభినందించారు.

Similar News

News November 13, 2025

వేములవాడ: మూడుకు తగ్గిన VIP గెస్ట్ హౌస్‌లు..!

image

వేములవాడ రాజన్న ఆలయంలో VIP గెస్ట్ హౌస్‌ల సంఖ్య మూడుకు తగ్గిపోయింది. భీమేశ్వరాలయం పక్కన మొత్తం 5 గెస్ట్ హౌస్‌లు ఉండగా, ఇటీవలి మార్పులలో భాగంగా ఒకదాంట్లో PRO కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మరోదాంట్లో లడ్డూ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఫలితంగా రాజన్న భక్తుల కోసం మిగిలిన అతిథి గృహాల సంఖ్య మూడుకు తగ్గింది. ఆలయాభివృద్ధి పనుల నేపథ్యంలో కూల్చివేతల జరుగుతున్నందున ఈ మార్పులు జరుగుతున్నాయి.

News November 13, 2025

నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర: నిఘా వర్గాలు

image

‘ఢిల్లీ పేలుడు’పై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి 4 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. ప్రతి గ్రూప్ భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని, పేలుళ్ల కోసం 20 క్వింటాళ్లకు పైగా ఎరువులను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఉమర్‌కు రూ.20 లక్షల డబ్బు అందిందని నిఘా వర్గాలు గుర్తించాయి.

News November 13, 2025

పాలమూరు వర్సిటీలో రేపు రెజ్లింగ్ ఎంపికలు

image

పాలమూరు యూనివర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా యూనివర్సిటీ రెజ్లింగ్ పోటీలకు (స్త్రీల) ఈనెల 14న ఎంపికలు నిర్వహించనున్నట్లు పీడీ డా.వై. శ్రీనివాసులు తెలిపారు. వీసీ జి.ఎన్. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్రీడాకారిణులు బోనఫైడ్, పదో తరగతి మెమోలతో హాజరు కావాలి. నేడే పేర్లు నమోదు చేసుకోవాలని, ప్రతి కళాశాల నుంచి ఐదుగురు పాల్గొనవచ్చని, వయస్సు 17-25 ఏళ్లలోపు ఉండాలని ఆయన సూచించారు.