News March 26, 2025

భద్రాద్రి: మహిళా రైతు ఆలోచన అదుర్స్!

image

ఇప్పటి వరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. కానీ అశ్వాపురం మండలం మల్లెలమడుగు వ్యవసాయ పొలంలో దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు మహిళా రైతు పడిదం వరలక్ష్మి ఈ నిఘా నేత్రాన్ని అమర్చారు. పొలంలో కూరగాయలు, విద్యుత్ మోటర్ చోరీకి గురికాకుండా సోలార్‌ కెమెరా ఏర్పాటు చేసినట్లు మహిళా రైతు తెలిపారు. ఈ వినూత్న ఆలోచనను చూసి పలువురు అభినందించారు.

Similar News

News November 2, 2025

మ‌ణికొండలో రూ.300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

image

HYD మ‌ణికొండ‌లో రూ.300 కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమి, పార్కు స్థలాల‌ను క‌బ్జాదారుల నుంచి హైడ్రా విముక్తి చేసింది. ప‌శ్చిమ ప్లాజా స‌మీపంలో ఎలాంటి ప‌త్రాలు లేని ఎక‌రం ప్ర‌భుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, క‌బ్జాదారుల‌ను ఖాళీ చేయించింది. వెంకటేశ్వర కాలనీ, తిరుమల హిల్స్‌లోని మొత్తం 7,650 గజాల రెండు పార్కు స్థలాలను కూడా హైడ్రా తిరిగి తీసుకుంది. ఈ స్థలాల్లో హైడ్రా బోర్డులు, ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది.

News November 2, 2025

మ‌ణికొండలో రూ.300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

image

HYD మ‌ణికొండ‌లో రూ.300 కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమి, పార్కు స్థలాల‌ను క‌బ్జాదారుల నుంచి హైడ్రా విముక్తి చేసింది. ప‌శ్చిమ ప్లాజా స‌మీపంలో ఎలాంటి ప‌త్రాలు లేని ఎక‌రం ప్ర‌భుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, క‌బ్జాదారుల‌ను ఖాళీ చేయించింది. వెంకటేశ్వర కాలనీ, తిరుమల హిల్స్‌లోని మొత్తం 7,650 గజాల రెండు పార్కు స్థలాలను కూడా హైడ్రా తిరిగి తీసుకుంది. ఈ స్థలాల్లో హైడ్రా బోర్డులు, ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది.

News November 2, 2025

దీపం వెలిగిస్తుండగా మంటలు.. బాలిక మృతి

image

వెల్దుర్తి(M) నర్సాపురంలో నిప్పు అంటుకొని బాలిక మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక మాసం సందర్భంగా గత సోమవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని గొల్ల బుడ్డన్న కుమార్తె రేవతి(9) తీవ్రంగా గాయపడింది. బాలికకు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తుండగా కోలుకోలేక శుక్రవారం మృతిచెందింది. కాగా, ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.