News March 26, 2025
భద్రాద్రి: మహిళా రైతు ఆలోచన అదుర్స్!

ఇప్పటి వరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. కానీ అశ్వాపురం మండలం మల్లెలమడుగు వ్యవసాయ పొలంలో దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు మహిళా రైతు పడిదం వరలక్ష్మి ఈ నిఘా నేత్రాన్ని అమర్చారు. పొలంలో కూరగాయలు, విద్యుత్ మోటర్ చోరీకి గురికాకుండా సోలార్ కెమెరా ఏర్పాటు చేసినట్లు మహిళా రైతు తెలిపారు. ఈ వినూత్న ఆలోచనను చూసి పలువురు అభినందించారు.
Similar News
News December 3, 2025
భారత్ ముక్కలైతేనే బంగ్లాదేశ్కు శాంతి: అజ్మీ

బంగ్లా మాజీ ప్రధాని హసీనాను అప్పగించడంపై భారత్-బంగ్లా మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. ఇలాంటి తరుణంలో బంగ్లా ఆర్మీ మాజీ జనరల్, జమాతే ఇస్లామీ మాజీ చీఫ్ గులాం అజామ్ కుమారుడు అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ ముక్కలవ్వకుండా ఉన్నంతకాలం బంగ్లాలో శాంతి నెలకొనదు’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. 1971 లిబరేషన్ వార్లో హిందువులు, ప్రో లిబరేషన్ బెంగాలీల ఊచకోతకు ఇతని తండ్రే కారణం.
News December 3, 2025
రాగి పాత్రలు వాడుతున్నారా?

ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది రాగిపాత్రల వాడకం మొదలుపెట్టారు. అయితే వీటిలో కొన్ని ఆహారపదార్థాలు పెట్టేటపుడు జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. రాగిపాత్రలో పెట్టిన పెరుగును తింటే వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి. అలా-గే సిట్రస్ ఫ్రూట్స్తో పెట్టిన పచ్చళ్లు, ఆహారాలు రాగితో రసాయన చర్యలు జరుపుతాయి. కేవలం నీటిని, అదీ 8-12 గంటలపాటు నిల్వ ఉంచిన నీటినే తాగాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
తాండూర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ACB దాడులు (UPDATE)

తాండూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి రూ.16,500 లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ (ఇన్ఛార్జ్ సబ్రిజిస్ట్రార్) సాయికుమార్, డాక్యుమెంట్ రైటర్ హరినాథ్ పట్టుబడ్డారు. దాడుల సమయంలో కార్యాలయం షట్టర్ను మూసివేసి లోపల విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు షట్టర్లు మోసేసి పరారయ్యారు.


