News May 3, 2024
భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కవచాలంకరణ

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం స్వర్ణ కవచాలంకరణ నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, అభిషేకం నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
Similar News
News November 21, 2025
ఖమ్మం: ఇందిరమ్మ చీరల పంపిణీకి మంత్రి తుమ్మల ఆదేశం

ఖమ్మం జిల్లాలో 18ఏళ్లు నిండిన ప్రతి గ్రామీణ మహిళకు ఇందిరమ్మ చీరలను ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకుంటే రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి ప్రకటించారు.
News November 21, 2025
ఖమ్మం: ఇందిరమ్మ చీరల పంపిణీకి మంత్రి తుమ్మల ఆదేశం

ఖమ్మం జిల్లాలో 18ఏళ్లు నిండిన ప్రతి గ్రామీణ మహిళకు ఇందిరమ్మ చీరలను ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకుంటే రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి ప్రకటించారు.
News November 21, 2025
ఖమ్మంలో ఫుట్ పాత్ల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. నగరంలో ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలపై చర్చించారు. వైరా రోడ్డు, బైపాస్, ఇల్లందు రోడ్డు వంటి 8 ప్రధాన రోడ్లకు ఫుట్ పాత్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.


