News March 29, 2025
భద్రాద్రి: వడదెబ్బ సోకి వ్యక్తి మృతి

భద్రాద్రి జిల్లాలో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. టేకులపల్లి మండలంలోని కొప్పు రాయి గ్రామంలో శుక్రవారం వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందారు. గ్రామానికి చెందిన వేప బక్కయ్య(55) మిర్చి ఏరడానికి కూలీ పనులకు వెళ్లడంతో వడదెబ్బ తగిలిందని, దీంతో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య సాయమ్మతో పాటు ముగ్గురు పిల్లలు కలరు.
Similar News
News September 14, 2025
అభివృద్ధి వైపు కొడంగల్ అడుగులు

కొడంగల్పై సీఎం రేవంత్రెడ్డి ఫోకస్ పెట్టడంతో నియోజకవర్గ అభివృద్ధికి రూ.10వేల కోట్లు మంజూరయ్యాయి. రూ.6.80 కోట్లతో R&B అతిథిగృహం పనులు కొనసాగుతుండగా 220 పడకల ఆసుపత్రి పనులు తుదిదశలో ఉన్నాయి. నూతన మున్సిపల్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రోడ్ల విస్తరణకు రూ.344 కోట్లు మంజూరు కావడంతో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
News September 14, 2025
ఖమ్మంలో లోక్ అదాలత్.. 597 కేసులు పరిష్కారం

ఖమ్మం జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ ప్రారంభించారు. లోక్ అదాలత్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని ఆయన చెప్పారు. ఈ లోక్ అదాలత్లో మొత్తం 4,746 కేసులను గుర్తించగా, వాటిలో 597 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. భార్యాభర్తల గొడవలు, ఆస్తి వివాదాలు, బ్యాంక్ రికవరీ, రోడ్డు ప్రమాదాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు
News September 14, 2025
మీరు ఇలాంటి సబ్బును ఉపయోగిస్తున్నారా?

కొందరు ఏది దొరికితే అదే సబ్బుతో స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల శరీరానికి హానీ కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రత్యేకంగా సబ్బు వాడాలనుకునేవారు వైద్యుడి సలహా తీసుకోవాలి. కొబ్బరి నూనె, షియా బటర్, కలబంద, తేనె వంటి సహజ పదార్థాలతో చేసిన సోప్ వాడాలి. ఇవి చర్మం, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. రసాయనాలు కలిపిన సబ్బులతో స్నానం చేస్తే చికాకు, ఆందోళన, అనారోగ్యం పాలవుతారు’ అని వారు చెబుతున్నారు.