News April 16, 2025

భద్రాద్రి: ‘సన్నబియ్యం పంపిణీపై ఫేక్ న్యూస్ నమ్మొద్దు’

image

తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా పౌరసరఫరాల శాఖ అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు. చౌక దుకాణాల ద్వారా ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదయిందని చెప్పారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం బాగున్నాయని, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News December 5, 2025

దోస్త్ మేరా దోస్త్

image

మన దేశంలో ప్రభుత్వాలు మారినా రష్యాతో సంబంధాలు మాత్రం అలాగే ఉన్నాయి. 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అమెరికా పాక్‌కు సపోర్ట్ చేసింది. అయితే సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా) భారత్ వైపు నిలబడింది. బంగాళాఖాతంలో సబ్‌మెరైన్‌తో మోహరించగానే అమెరికా సైన్యం భయపడి వెనక్కి వెళ్లిపోయింది. దీంతో ఆ యుద్ధంలో భారత్ గెలిచింది. మనం వాడుతున్న యుద్ధవిమానాల్లో 80% రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే కావడం విశేషం.

News December 5, 2025

చెరువు మట్టితో చాలా లాభాలున్నాయ్

image

చెరువులోని పూడిక మట్టిని పొలంలో వేస్తే భూమికి, పంటకు చాలా మేలు జరుగుతుంది. చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరతాయి. వేసవిలో చెరువులు అడుగంటుతాయి. అప్పుడు చెరువు మట్టిని పొలాల్లో వేస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియ కర్భన పదార్థాలతో పాటు.. మొక్కల పెరుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నేలలో వృద్ధి చెందుతాయి.

News December 5, 2025

రంప: పాఠశాలలో ఆడుకుంటు..కుప్పకూలిన విద్యార్థిని

image

రంపచోడవరం మండలం తామరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల‌లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థిని కె. జానుశ్రీ పాఠశాలలో తోటి విద్యార్థులతో ఆడుకుంటుండగా..ఫీట్స్‌ వచ్చి పడి పోయింది. బాలిక పేరెంట్స్, టీచర్స్ హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారరు.