News April 16, 2025
భద్రాద్రి: ‘సన్నబియ్యం పంపిణీపై ఫేక్ న్యూస్ నమ్మొద్దు’

తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా పౌరసరఫరాల శాఖ అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు. చౌక దుకాణాల ద్వారా ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదయిందని చెప్పారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం బాగున్నాయని, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 18, 2025
మహబూబ్నగర్ జిల్లాలో 40 డిగ్రీలకు చెరువలో ఎండ

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10గంటలు దాటిందంటే ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నటు పరిస్థితి నెలకొంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 21.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
News April 18, 2025
తిర్యాణి: ‘శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్’

ASF జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం SP డీవీ శ్రీనివాస్ రావు ఆదేశానుసారం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు రెబ్బెన సీఐ బుద్ధస్వామి వెల్లడించారు. నాయకపుగూడలో ఎస్సై శ్రీకాంత్తో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. సరైన ధృవపత్రాలు లేని 12 వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. గుడుంబా, గంజాయి విక్రయాలు కార్యక్రమాలు చేయొద్దని గ్రామస్థులకు సూచించారు.
News April 18, 2025
మెలోనీ అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్

ఇటలీ PM జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని ట్రంప్ తెలిపారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని అని, వ్యక్తిగతంగానూ ఆవిడతో మంచి అనుబంధం ఉందన్నారు. ఆవిడలో చాలా ప్రతిభ ఉందని, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరంటూ కొనియాడారు. టారిఫ్స్ పెంపుపై US వైఖరిని మెలోనీ వ్యతిరేకించినా.. యూరోపియన్ దేశాల నుంచి ట్రంప్ని కలిసిన తొలి ప్రధాని ఆవిడే.