News February 10, 2025

భద్రాద్రి: సర్పంచ్ ఎన్నికలు.. అదనపు కలెక్టర్ సూచన

image

గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఆమోదం, అభ్యంతరాల స్వీకరణపై భద్రాద్రి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అధ్యక్షతన ఐడీఓసీ కార్యాలయ సమావేశం మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా చందన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. అధికారులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. 

Similar News

News December 31, 2025

పెరుగుతున్న హత్యాయత్నం కేసులు.. ఫోకస్ పెంచండి సార్.!

image

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025లో పలు నేరాల్లో తగ్గుదల నమోదైంది. హత్యలు 39 నుంచి 34కి, కిడ్నాప్‌లు 54 నుంచి 46కి, తీవ్రమైన గాయాల కేసులు 87 నుంచి 71కి, సాధారణ గాయాల కేసులు 733 నుంచి 655కి తగ్గాయి. మహిళలపై నేరాల్లోనూ మెరుగుదల కనిపించగా, హత్యాయత్నం కేసులు మాత్రం స్వల్పంగా పెరిగినట్లు విజయవాడ పోలీస్ కమిషనరేట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

News December 31, 2025

నెల్లూరులో 6899 నాణ్యత లేని ఇళ్లు .!

image

ఇళ్లు లేని వారికి గూటిని సమకూర్చడంలోనూ.. అధికారులు.. కాంట్రాక్టర్ల ధన దాహం నిజమనేది తేటతెల్లమవుతోంది. స్వయానా గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ బాబు జిల్లా అధికారుల సమీక్షలో 6899 ఇళ్లు స్లాబులు, గోడలు, బేస్మెంట్లు నిర్మాణాలు నాణ్యత లోపించినట్లు తేల్చి చెప్పారు. వీటికి యుద్ధ ప్రాటిపాదికన మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు అందజేసిన పిదపే.. బిల్లులు మంజురు చేస్తున్నట్లు హెచ్చరించారు.

News December 31, 2025

PGRSలో 9,300 సమస్యలు పరిష్కారం: కడప ఎస్పీ

image

కడప జిల్లాలో 2025 ఏడాదికి ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక(PGRS)లో 9,704 పిర్యాదులు వచ్చాయని.. వాటిలో 9,300 ఫిర్యాదులు నిర్ణీత గడువులోపు పరిష్కరించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. ప్రజాసేవ, సమాజంలో భాగస్వామ్యం, చట్టం అమలులో ఉన్నత ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందినట్లు తెలిపారు. 2026లో మరింత అంకితభావంతో ప్రజలకు ఉన్నతమైన సేవలు అందిస్తామని తెలిపారు.