News January 25, 2025
భద్రాద్రి: స్మగ్లర్లు, వేటగాళ్లపై కఠిన చర్యలు: DFO కృష్ణగౌడ్

అడవుల్లో వన్యప్రాణులకు ఉచ్చులు ఏర్పాటు చేసి జంతువులను చంపుతున్న వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ సూచించారు. శుక్రవారం ఆయన రేగళ్ల, ఆళ్లపల్లి, చాతకొండ పలు రేంజిలను సందర్శించారు. అడవిని కొల్లగొడుతున్న స్మగ్లర్లు, వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రేంజర్లు జశ్వంత్, కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 12, 2025
VKB: ప్రజల భద్రత కోసమే తనిఖీలు: ఎస్పీ

ప్రజల భద్రత కోసమే ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్లోని బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ప్రధాన చౌరస్తాలలో డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా అనుమానితులు ఉంటే 100కు డయల్ చేయాలన్నారు.
News November 12, 2025
ఉదయాన్నే నిద్ర లేవాలని ఎందుకు చెబుతారు?

సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో నిద్రలేచే ప్రకృతిలోని సకల జీవచరాలు నిష్కల్మషంగా, నిస్వార్థంగా, అత్యంత సమయస్ఫూర్తి, అంకితభావంతో ఉంటాయని నమ్మకం. మనిషి కూడా అదే సమయంలో నిద్ర లేస్తే ఆ సుగుణాలు మనలోనూ అలవరతాయని విశ్వాసం. సూర్యోదయానికి ముందు లేస్తే పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. లేకపోతే పనులు సకాలంలో పూర్తికావని కాకులు ‘కావ్.. కావ్..’ అంటూ మనకు చెబుతాయి. <<-se>>#Jeevanam<<>>
News November 12, 2025
అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.


