News March 29, 2025
భరత్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మహిళ హత్య కేసును ఛేదించారు

ఈనెల 26న జరిగిన భరత్ నగర్ ఫ్లైఓవర్ కింద జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. జనగామ చెందిన కనకరాజు అనే వ్యక్తి ఆ మహిళతో శారీరకంగా కలిసిన తర్వాత కొట్టి హత్య చేసినట్టు తెలిపారు. హత్య చేసిన వ్యక్తి పలు కేసులో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు.
Similar News
News November 6, 2025
TODAY HEADLINES

➭ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
➭ KTR.. రాజీనామాకు సిద్ధంగా ఉండు: CM రేవంత్
➭ 3 ఫీట్ల రేవంత్ 30 ఫీట్లున్నట్టు బిల్డప్ ఇస్తాడు: KTR
➭ APలోని 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB తనిఖీలు
➭ కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: మంత్రి అనగాని
➭ ఆకాశంలో కనువిందు చేసిన సూపర్ మూన్
➭ PM మోదీతో ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ భేటీ
➭ SA టెస్ట్ సిరీస్కు భారత జట్టు ప్రకటన.. పంత్ రీఎంట్రీ
News November 6, 2025
ప్రభుత్వ వర్సిటీల్లో యూనిఫైడ్ యాక్ట్: లోకేశ్

AP: ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఉన్నత, ఇంటర్ విద్యపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని ఆదేశించాను. ITIలు, వర్సిటీలను NOVలోగా పరిశ్రమలతో అనుసంధానించాలి. విద్యార్థుల 100% క్యాంపస్ సెలక్షన్స్కు చర్యలు తీసుకోవాలి. ఇంటర్లో ఉత్తీర్ణత పెంపునకు చర్యలు చేపట్టాలి’ అని తెలిపారు.
News November 6, 2025
హైటెక్స్లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025

HYDలో నవంబర్ 25- 28 వరకు దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో జరగనుంది. వన్ నేషన్ వన్ EXPO థీమ్తో జరిగే ఈవెంట్లో 50 దేశాల నుంచి 500 ఎగ్జిబిటర్స్, 40,000 కుపైగా సందర్శకులు పాల్గొంటారు. 35,000 చదరపు మీటర్లలో తాజా పౌల్ట్రీ సాంకేతికతలు, సస్టైనబుల్ సొల్యూషన్స్ ప్రదర్శించబడతాయి. దేశ పౌల్ట్రీ రంగం రూ.1.35 లక్షల కోట్లతో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.


