News December 22, 2024
భరోసాతో మహిళలకు మరింత భద్రత: డీజీపీ జితేందర్

కరీంనగర్లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంతో మహిళలకు, బాలికలకు మరింత భద్రత కలుగుతుందని డీజీపీ జితేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా పోలీసు, న్యాయ, వైద్య సేవలు ఒకే గూటి కింద ఉంటాయని, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చూస్తామన్నారు.
Similar News
News February 24, 2026
KNR: ‘పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను కరీంనగర్ జిల్లాలో ఎక్కడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 74 కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని, మాస్ కాపీయింగ్కు తావులేకుండా నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు.
News February 24, 2026
KNR: ‘మహిళా కార్యకర్తలు కృషి చేయాలి’

కరీంనగర్ DCC కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో నేడు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పార్టీ కోసం పోరాడిన సీనియర్ మహిళా నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. రాబోయే ZPTC, MPTC ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మహిళా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News February 24, 2026
KNR: డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ఈ నెల 27న వాహన చోదకులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణలో కంటిచూపు కీలకమని, ఆర్టీసీ, ఆటో, ఇతర వాహన డ్రైవర్లు పోలీసు ప్రధాన కార్యాలయం పక్కన గల అస్త్ర కన్వెన్షన్ హాల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.


