News March 19, 2025
‘భర్త అనుమానించడం వలనే హత్య చేశా’

విశాఖలో ఓ తల్లి కన్న కూతురినే హతమార్చింది. పెద్దగదిలిలో జరిగిన ఈ హత్య కేసులో నిజానిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పాప పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా తెలుస్తోంది. భర్త అనుమానంతో బెడ్ రూమ్లో కూడా CC కెమెరా పెట్టాడని దీంతో మనస్తాపం చెంది కూతురిని తల దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితురాలు శిరీష పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్లు ఆరిలోవ CI మల్లేశ్వరరావు తెలిపారు.
Similar News
News December 4, 2025
VZM: ‘డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేశారు’

డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను విజయనగరం రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న డెంకాడ వద్ద విశాఖకు చెందిన మహేష్ కుమార్ యాదవ్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోందని రూరల్ సీఐ లక్ష్మణ రావు తెలిపారు.
News December 4, 2025
VZM: జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

ఈ నెల 13న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ మార్గంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులతో గురువారం వీసీ నిర్వహించారు. రాజీ పడదగిన కేసులను ఇరు పక్షాల అంగీకారంతో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. లోక్ అదాలత్పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు.
News December 4, 2025
VZM: హోంమంత్రి అధ్యక్షతన నేడు DRC సమావేశం

విజయనగరం కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రగతి, ప్రజా సేవల అమలు స్థితి, సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.


