News March 7, 2025

భర్త చేతిలో గాయపడిన భార్య మృతి

image

ఉమ్మడి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో భర్త వెంకటరామిరెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య విద్య మనోహరమ్మ బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యపై అనుమానం పెంచుకొని, తాగిన మైకంలో వెంకట్రామిరెడ్డి రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న మనోహరమ్మను బనగానపల్లెకు తరలించగా మృతి చెందినట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.

Similar News

News November 27, 2025

ఎలక్టర్ల మ్యాపింగ్‌లో పురోగతి ఉండాలి: కర్నూల్ కలెక్టర్

image

ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియలో మరింత పురోగతి తీసుకురావాలని కర్నూల్ జిల్లా కలెక్టర్ సిరినీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ సూచించారు. గురువారం విజయవాడలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫార్ములను త్వరితగతిన క్లియర్ చేయాలని, బీఎల్ఓ, ఎపిక్ కార్డు పంపిణీ, మ్యాపింగ్, శిక్షణ విషయాలను వేగవంతంచేయాలని సూచించారు.

News November 27, 2025

విద్యార్థులతో కర్నూలు కలెక్టర్ మాటామంతి

image

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి బుధవారం కార్యాలయ ఛాంబర్లో మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం రక్షణపై పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల అవగాహనను పరిశీలించారు. విద్యార్థుల పాఠశాల సమస్యలు, పాఠ్యాంశాల బోధన, 10వ తరగతి పరీక్షలకు సిద్ధత వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. ధైర్యంగా సమాధానాలిచ్చిన విద్యార్థులను అభినందించారు.

News November 26, 2025

కలెక్టర్‌ను మైమరిపించిన ఓర్వకల్లు మహిళా రైతు

image

ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రాజకుమారిని కలెక్టర్ డా. ఏ. సిరి ప్రశంసించారు. బుధవారం రాజకుమారి పొలంను కలెక్టర్ పరిశీలించి పంటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 70 సెంట్ల భూమిలో అంతర పంటల పద్ధతిలో కందులు, అలసందలు, సజ్జలు, మినుములు, గోరు చిక్కుడు, ఆకుకూరలు సాగు చేసి రూ.5 వేల పెట్టుబడితో రూ.60 వేల లాభం సాధించినట్లు రాజకుమారి వివరించారు.