News July 22, 2024

భర్త నుంచి కాపాడండి: బనగానపల్లె మహిళ

image

భర్త నుంచి తనను కాపాడాలంటూ నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓ మహిళ ఫిర్యాదు చేశారు. బనగానపల్లెకు చెందిన ఉప్పరి అన్నపూర్ణ అనే మహిళ భర్త నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందని తెలిపారు. అదనపు కట్నం కోసం తరచూ హింసిస్తుంటే రూ.లక్ష ఇచ్చామని అయినా మరికొంత డబ్బు కావాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల పత్రంపై సంతకం పెట్టాలంటూ తనపై దాడి కూడా చేశాడని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు ఫిర్యాదు చేశారు.

Similar News

News October 20, 2025

నేడు పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ వేదిక జరగాల్సి ఉంది. పండుగ కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో కార్యక్రమం నిలిపివేశామని ఎస్పీ పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి వచ్చే ప్రజలు వ్యయప్రయాసలతో రావొద్దని విజ్ఞప్తి చేశారు.

News October 20, 2025

నేడు రద్దు: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ వేదిక జరగాల్సి ఉంది. పండుగ కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో కార్యక్రమం నిలిపివేశామని ఎస్పీ పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి వచ్చే ప్రజలు వ్యయప్రయాసలతో రావొద్దని విజ్ఞప్తి చేశారు.

News October 19, 2025

కర్నూలు: 9 నెలల్లో 6,858 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

కర్నూలు రేంజ్‌లో 9 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 6,858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. రహదారి భద్రతలో భాగంగా ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 13,555 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.