News March 26, 2025

భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య: నర్సీపట్నం సీఐ

image

నాతవరం మండలం ఎంబీ పట్నంలో మంగళవారం భర్త మందలించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు నర్సీపట్నం సీఐ రేవతమ్మ తెలిపారు. కుమార్తె అల్లరి చేయడంతో తల్లి వెంకటలక్ష్మి కొట్టినట్లు తెలిపారు. కుమార్తెను ఎందుకు కొట్టావని భర్త గోవింద్ భార్యను మందలించాడన్నారు. అనంతరం గోవింద్ జీడి తోటలోకి వెళ్ళిపోగా మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News November 24, 2025

కొడంగల్: ‘CM TOUR’ షెడ్యూల్ విడుదల

image

సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారంలో పాల్గొని
మధ్యాహ్నం 2.40గంలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కొడంగల్‌కు బయలుదేరుతారు. 3.55 గంటల నుంచి 4.55 వరకు అక్షయపాత్ర గ్రీన్ ఫీల్డ్ కిచెన్ భూమి పూజ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5గం. హైదరాబాద్ బయలుదేరుతారు.

News November 24, 2025

32,438 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

RRB గ్రూప్-D పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <>https://www.rrbcdg.gov.in/<<>>లో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 32,438 పోస్టులకు ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇప్పటికే ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

News November 24, 2025

రేపు GHMC పాలకమండలి సమావేశం!

image

GHMC 12వ సాధారణ సమావేశాన్ని రేపు ప్రధాన కార్యాలయంలో నిర్వహించనుంది. ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ప్రస్తుత పాలక మండలికి జనవరిలో చివరి సమావేశం ఉంటుందని GHMC వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లలో GHMCలో 146 మంది ఉన్నారు. BRS–40, MIM–41, INC–24, BJP–41 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు మరణించడం, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో 4 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.