News March 26, 2025
భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య: నర్సీపట్నం సీఐ

నాతవరం మండలం ఎంబీ పట్నంలో మంగళవారం భర్త మందలించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు నర్సీపట్నం సీఐ రేవతమ్మ తెలిపారు. కుమార్తె అల్లరి చేయడంతో తల్లి వెంకటలక్ష్మి కొట్టినట్లు తెలిపారు. కుమార్తెను ఎందుకు కొట్టావని భర్త గోవింద్ భార్యను మందలించాడన్నారు. అనంతరం గోవింద్ జీడి తోటలోకి వెళ్ళిపోగా మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News November 24, 2025
కొడంగల్: ‘CM TOUR’ షెడ్యూల్ విడుదల

సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారంలో పాల్గొని
మధ్యాహ్నం 2.40గంలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కొడంగల్కు బయలుదేరుతారు. 3.55 గంటల నుంచి 4.55 వరకు అక్షయపాత్ర గ్రీన్ ఫీల్డ్ కిచెన్ భూమి పూజ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5గం. హైదరాబాద్ బయలుదేరుతారు.
News November 24, 2025
32,438 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

RRB గ్రూప్-D పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <
News November 24, 2025
రేపు GHMC పాలకమండలి సమావేశం!

GHMC 12వ సాధారణ సమావేశాన్ని రేపు ప్రధాన కార్యాలయంలో నిర్వహించనుంది. ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ప్రస్తుత పాలక మండలికి జనవరిలో చివరి సమావేశం ఉంటుందని GHMC వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లలో GHMCలో 146 మంది ఉన్నారు. BRS–40, MIM–41, INC–24, BJP–41 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు మరణించడం, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో 4 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.


