News March 26, 2025

భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య: నర్సీపట్నం సీఐ

image

నాతవరం మండలం ఎంబీ పట్నంలో మంగళవారం భర్త మందలించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు నర్సీపట్నం సీఐ రేవతమ్మ తెలిపారు. కుమార్తె అల్లరి చేయడంతో తల్లి వెంకటలక్ష్మి కొట్టినట్లు తెలిపారు. కుమార్తెను ఎందుకు కొట్టావని భర్త గోవింద్ భార్యను మందలించాడన్నారు. అనంతరం గోవింద్ జీడి తోటలోకి వెళ్ళిపోగా మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

అనకాపల్లి: తుఫాను భయం.. రైతులకు సూచనలివే

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో రైతులు వరికోతలను రెండుమూడు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. పరిస్థితిలు అనుకూలించిన తర్వాత మాత్రమే కోతలు ప్రారంభించాలన్నారు. కోసిన వరి పనలు తడిస్తే నూర్చి ఎండలో ఎండ పెట్టాలన్నారు. ప్రతి క్వింటాల్ ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల ఊకపొడి కలపాలన్నారు. మొలకలు రాకుండా ఉండేందుకు ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు.

News December 1, 2025

చీడికాడ: గంజాయి కేసులో నలుగురికి 10 ఏళ్లు జైలు శిక్ష

image

చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో నమోదైన గంజాయి కేసులో నలుగురు నిందితులకు 10ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, ఒక్కొక్కరికీ రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం.హరినారాయణ తీర్పు చెప్పినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన వివరాలు వెల్లడించారు. ధరావత్ రవి, మడ్డు నర్సింహరాజు, దాలిబోయిన ఫల్గుణ, బండారు సంతోష్‌లకు ఈ శిక్ష పడినట్లు చెప్పారు.