News March 26, 2025
భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య: నర్సీపట్నం సీఐ

నాతవరం మండలం ఎంబీ పట్నంలో మంగళవారం భర్త మందలించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు నర్సీపట్నం సీఐ రేవతమ్మ తెలిపారు. కుమార్తె అల్లరి చేయడంతో తల్లి వెంకటలక్ష్మి కొట్టినట్లు తెలిపారు. కుమార్తెను ఎందుకు కొట్టావని భర్త గోవింద్ భార్యను మందలించాడన్నారు. అనంతరం గోవింద్ జీడి తోటలోకి వెళ్ళిపోగా మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 14, 2025
SDPT: ఈ నెల 16,17న జిల్లా స్థాయి సెలక్షన్

సిద్దిపేట జిల్లా ఆత్య పత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆత్య, పత్య జూనియర్ బాయ్స్, గర్ల్స్ క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని ప్రధాన కార్యదర్శి బుస్స మహేష్ తెలిపారు. ఈ నెల 16,17తేదీలలో చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సెలక్షన్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పోటిల్లో పాల్గొనాలని సూచించారు.
News October 14, 2025
దేశంలోనే తొలి డ్రోన్ హబ్ ఓర్వకల్లులోనే..

దేశంలోనే తొలి <<18000986>>డ్రోన్ <<>>హన్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు కానుంది. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ దీని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. డ్రోన్ల వినియోగానికి విస్తృత అవకాశాలున్న మ్యాపింగ్, సర్వే, వ్యవసాయం, ఫొటోగ్రఫీ, తనిఖీలు, నిఘా రంగాలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. డ్రోన్ల రంగంలో మన దేశ వాటా కేవలం 3 శాతం కాగా దీన్ని 20 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తోంది.
News October 14, 2025
కాజులూరులో అత్యధిక వర్షపాతం నమోదు

గడచిన 24 గంటల్లో జిల్లాలో 224.8 mm వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాజులూరు మండలంలో 78.4, అత్యల్పంగా శంఖవరంలో 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచార శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా సగటున వర్షపాతం 10.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లాలోని 21 మండలాల్లో వర్షపాతం నమోదైంది.