News March 3, 2025
భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన్మరణం

శ్రీ సత్యసాయి జిల్లాలో విషాద ఘటన జరిగింది. హిందూపురం మండలం కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు ఉదయం పొలం నుంచి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురై కుప్పకూలి మృతిచెందారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన భార్య భాగ్యమ్మ (60) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
Similar News
News December 24, 2025
వైభవ్ మరో సెంచరీ

విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ చెలరేగారు. బిహార్ తరఫున ఆడుతున్న అతను అరుణాచల్తో మ్యాచ్లో 36 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం డబుల్ సెంచరీ దిశగా అతని ఇన్నింగ్స్ కొనసాగుతోంది.
News December 24, 2025
కరీంనగర్: ఒకటో తరగతి విద్యార్థినిపై దారుణం

ఒకటో తరగతి బాలికపట్ల 8వ తరగతి బాలుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్(D) చొప్పదండి మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చోటుచేసుకుంది. ఈ ఇష్యూను సీరియస్గా తీసుకున్న కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన పోలీసులు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చోట వికృత చేష్టలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
News December 24, 2025
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. మంత్రుల కమిటీ ఏర్పాటు

అమరావతిలో ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్ విగ్రహం, స్మారక కేంద్రం పనుల పర్యవేక్షణకు ఏపీ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని నియమించింది. విగ్రహ డిజైన్, స్థలం ఖరారు, డీపీఆర్ పరిశీలన, చెరువు చుట్టూ వాణిజ్య అభివృద్ధిపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. పురపాలక, ఆర్థిక, పర్యాటక, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దీనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.


