News March 3, 2025

భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన్మరణం

image

శ్రీ సత్యసాయి జిల్లాలో విషాద ఘటన జరిగింది. హిందూపురం మండలం కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు ఉదయం పొలం నుంచి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురై కుప్పకూలి మృతిచెందారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన భార్య భాగ్యమ్మ (60) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

Similar News

News November 22, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్‌ను నియమిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పలువురు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News November 22, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్‌ను నియమిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పలువురు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News November 22, 2025

భూపాలపల్లి DCC అధ్యక్షుడిగా భట్టు కర్ణాకర్

image

భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా భట్టు కర్ణాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ యూత్ జిల్లా అధ్యక్షుడిగా చేసిన కర్ణాకర్‌కు అధిష్ఠానం జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది.