News March 3, 2025

భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన్మరణం

image

శ్రీ సత్యసాయి జిల్లాలో విషాద ఘటన జరిగింది. హిందూపురం మండలం కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు ఉదయం పొలం నుంచి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురై కుప్పకూలి మృతిచెందారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన భార్య భాగ్యమ్మ (60) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

Similar News

News November 18, 2025

మచిలీపట్నంలో మరో ప్రాజెక్ట్‌కు ఒప్పందం

image

మచిలీపట్నంకు మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. రూ.6500 కోట్లతో గోవా షిప్ యార్డ్ నిర్మాణం జరగనుంది. ఇటీవల విశాఖలో జరిగిన CII సదస్సులో గోవా షిప్ యార్డ్ సంస్థ ప్రభుత్వంతో MOU చేసుకుంది. గోవా షిప్ యార్డ్ నిర్మాణం ద్వారా 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మచిలీపట్నంలో ఇప్పటికే పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గోవా షిప్ యార్డ్ నిర్మాణం కూడా జరిగితే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టినట్టే.

News November 18, 2025

మచిలీపట్నంలో మరో ప్రాజెక్ట్‌కు ఒప్పందం

image

మచిలీపట్నంకు మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. రూ.6500 కోట్లతో గోవా షిప్ యార్డ్ నిర్మాణం జరగనుంది. ఇటీవల విశాఖలో జరిగిన CII సదస్సులో గోవా షిప్ యార్డ్ సంస్థ ప్రభుత్వంతో MOU చేసుకుంది. గోవా షిప్ యార్డ్ నిర్మాణం ద్వారా 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మచిలీపట్నంలో ఇప్పటికే పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గోవా షిప్ యార్డ్ నిర్మాణం కూడా జరిగితే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టినట్టే.

News November 18, 2025

ప.గో. జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా కందుల భాను ప్రసాద్

image

పశ్చిమగోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా భీమవరం పట్టణానికి చెందిన కందుల భాను ప్రసాద్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేశ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళ్రావు చేతుల మీదుగా మంగళవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.