News March 25, 2025
‘భర్త వేధింపులతోనే సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య’

భర్త వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాండ్లపెంట మండలంలోని వంకపల్లి గ్రామానికి చెందిన గ్రామ సచివాలయ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ రాజేశ్వరి(29) అనే వివాహిత సోమవారం ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి రామసుబ్బమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వాలిబాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 23, 2026
అధికారులు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్

భూపాలపల్లి జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కాలంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
News February 23, 2026
బోద నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి: VZM కలెక్టర్

జిల్లాలో బోద (ఫైలేరియా) నివారణ ప్రత్యేక కార్యక్రమాన్ని లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. గుర్ల మండలంలో ఇప్పటివరకు 5,516 మందికి డీఈసీ మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 7,710 మందికి మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
News February 23, 2026
రామసముద్రం: జ్వరంతో ఇంటర్ విద్యార్థిని మృతి

రామసముద్రం మండలం గంపనంపల్లికి చెందిన పవిత్ర (17) తిరుపతిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 20న జ్వరం రావడంతో పద్మావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. పరిస్థితి విషమించడంతో రుయా ఆసుపత్రికి తరలించగా.. ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


