News March 25, 2025
‘భర్త వేధింపులతోనే సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య’

భర్త వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాండ్లపెంట మండలంలోని వంకపల్లి గ్రామానికి చెందిన గ్రామ సచివాలయ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ రాజేశ్వరి(29) అనే వివాహిత సోమవారం ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి రామసుబ్బమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వాలిబాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 4, 2025
2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 4, 2025
భారీ జీతంతో పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<
News December 4, 2025
నిర్మల్: సర్పంచ్ బరిలో దివ్యాంగుడు

ప్రజాసేవకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించేందుకు శంకర్ సిద్ధమయ్యాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల–బి నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేశాడు. 2 చేతులు లేకున్నా ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ప్రజాసేవలోకి అడుగుపెట్టాడు. శంకర్ నామినేషన్ వేసిన వెంటనే గ్రామస్థులు అతడిని అభినందించారు. రాజకీయాలు దివ్యాంగులకు అందని ద్రాక్ష కాకూడదని, తాము కూడా ప్రజాసేవలో ముందుంటామని శంకర్ నిరూపించాడు.


