News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హనుమకొండ, జనగామ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 28, 2025
APPLY NOW: ఉమెన్ డెవలప్మెంట్ & చైల్డ్ వెల్ఫేర్లో ఉద్యోగాలు

AP: బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్మెంట్ ఆఫీస్లో 8 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, ఇంటర్, BA(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, B.Ed, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bapatla.ap.gov.in/
News November 28, 2025
గజ్వేల్లో దారుణం.. అమానుష ఘటన

గజ్వేల్ పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగో బిడ్డను సాకలేనని ఓ తల్లి అబార్షన్ మాత్రలు మింగి గర్భస్రావం చేసుకుంది. గర్భస్రావం అనంతరం ఆరు నెలల నెత్తుటి గుడ్డును గజ్వేల్లోని రాజిరెడ్డిపల్లి పార్శి కుంట వద్ద పడేశారు. దీంతో స్థానికులు గమనించి నిలదీయడంతో నిజం ఒప్పుకున్నారు. వెంటనే గజ్వేల్ పోలీసులు తల్లి, ఆమెకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చిన ఆర్ఎంపీని అరెస్ట్ చేశారు.
News November 28, 2025
వరంగల్: ఉద్దండులంతా సర్పంచ్లే!

రాజకీయాలకు ఉమ్మడి WGL పెట్టింది పేరు. గ్రామ నుంచి ఢిల్లీ స్థాయివరకు ఎదిగిన నాయకులు ఎందరో ఉన్నారు. మాజీ మంత్రి DS రెడ్యానాయక్ 1981లో మరిపెడ(M) ఉగ్గంపల్లి సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మాజీ MP సురేందర్ రెడ్డి 1959లో మరిపెడ సర్పంచ్గా పనిచేశారు. BHPL MLA గండ్ర సత్యనారాయణ రావు 1984లో గణపురం(M) బుద్దారం సర్పంచ్గా, NSPT MLA మాధవరెడ్డి 1981లో చెన్నరావుపేట(M) అమీనాబాద్ సర్పంచ్గా చేశారు.


