News March 7, 2025

భానుడి భగభగలు.. మండలాల్లో తీవ్ర వడగాల్పులు

image

అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముంది. ఆ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. గురువారం నాతవరంలో 39.9°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.

Similar News

News March 9, 2025

మెదక్: విషాదం..  మామ, కోడళ్లు మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో ఒకేరోజు మామ కోడలు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మక్కరాజుపేట కు చెందిన ఆరేళ్ల సుమలత (35) వారం రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి మామ పోచయ్య (35) తీసుకువెళ్తున్నాడు. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరగగా పోచయ్య గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న పోచయ్య ఈరోజు మృతిచెందగా, అస్వస్థతకు గురైన కోడలు సైతం మృతి చెందింది.

News March 9, 2025

చికిత్స పొందుతూ రాజన్నపేట యువకుడు మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకి చెందిన నమలికొండ నూతన్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. 2 నెలల క్రితం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట చేస్తూ కళ్ళు తిరిగి స్టవ్‌పై పడిపోవడంతో వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా సగభాగం శరీరం అంటుకుందని వైద్యులు తెలిపారు. హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతిచెందాడు.

News March 9, 2025

గ్రూప్-1 ఫలితాలు.. UPDATE

image

రేపు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ముందుగా మార్కులను ప్రకటించనుండగా తర్వాత రీకౌంటింగ్ కోసం అభ్యంతరాలు స్వీకరించనుంది. అనంతరం మెరిట్ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తితో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు గాను 21,093 మంది మెయిన్స్ పరీక్ష రాశారు.

error: Content is protected !!