News April 14, 2025
భారత ఆర్చరీ అసోసియేషన్ సభ్యులుగా MHBD జిల్లా వాసి శంకరయ్య

దేశంలో ఆర్చరీ అభివృద్ధి కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఎఐ) ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా వాసి పుట్ట శంకరయ్యను కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా నియమించింది. ఉమ్మడి జిల్లా ఆర్చరీ సంఘం అధ్యక్షులు సాదుల సారంగపాణి, డివైస్ సునీల్ రెడ్డి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణ ఫర్ బాబు, మానుకోట జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 22, 2025
HYD: లేడి కానిస్టేబుల్ అంటూ మోసం.. అరెస్ట్

జీడిమెట్లలో లేడి కానిస్టేబుల్ అంటూ పలువురిని మోసం చేస్తున్న మహిళను బాలానగర్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమా భారతిని రెడ్హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. నిందితురాలు ప్రజలను నమ్మించి మోసపూరిత కార్యకలాపాలు చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 22, 2025
HYD: లేడి కానిస్టేబుల్ అంటూ మోసం.. అరెస్ట్

జీడిమెట్లలో లేడి కానిస్టేబుల్ అంటూ పలువురిని మోసం చేస్తున్న మహిళను బాలానగర్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమా భారతిని రెడ్హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. నిందితురాలు ప్రజలను నమ్మించి మోసపూరిత కార్యకలాపాలు చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 22, 2025
మందస: లారీ ఢీకొని ఒకరు మృతి

లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మందస మండలం బాలిగాం బ్రిడ్జి సమీపాన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పలాస నుంచి ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై గుడ్లు లోడుతో వెళ్తున్న లారీ బాలిగాం బ్రిడ్జ్ సమీపాన బైక్ను ఢీకొంది. క్షతగాత్రుడికి తీవ్ర గాయలవ్వగా హరిపురం సీహెచ్సీకి తరలిస్తుండగా మరణించాడు. మృతుడు శాసనం గ్రామానికి చెందిన ధర్మారావు(45)గా సమాచారం. పోలీసు కేసు నమోదైంది.


