News April 14, 2025
భారత ఆర్చరీ అసోసియేషన్ సభ్యులుగా MHBD జిల్లా వాసి శంకరయ్య

దేశంలో ఆర్చరీ అభివృద్ధి కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఎఐ) ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా వాసి పుట్ట శంకరయ్యను కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా నియమించింది. ఉమ్మడి జిల్లా ఆర్చరీ సంఘం అధ్యక్షులు సాదుల సారంగపాణి, డివైస్ సునీల్ రెడ్డి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణ ఫర్ బాబు, మానుకోట జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 24, 2025
KNR: స్థానిక పోరుకు సిద్ధమా..?

ఉమ్మడి KNR జిల్లాలో పంచాయతీ పోరుకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు పూర్తి చేశారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేఫథ్యంలో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నచోట పోటీకి సిద్ధమవుతుండగా, రిజర్వేషన్లు అనుకూలం లేనిచోట అనుచరులను బరిలో నిలిపి స్థానికంగా పట్టు నిలుపుకోవాలని నాయకులు భావిస్తున్నారు. KNR జిల్లాలో 318గ్రామాలకు సర్పంచులు, 2,962 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
News November 24, 2025
అనకాపల్లి: రిజర్వాయర్లో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం

రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్లో గల్లంతైన మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. కొత్తకోట గ్రామానికి చెందిన గుమ్ముడు వాసు (29) ఆదివారం రిజర్వాయర్లో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తిరిగి కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రావికమతం అగ్రిమాపక కేంద్ర సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు.
News November 24, 2025
తెనాలి పన్నీర్ జిలేబీ.. యమా టెస్ట్ గురూ.!

ఆంధ్రాప్యారిస్ తెనాలి అంటేనే నోరూరించే జిలేబీకి ఎంతో ఫేమస్. బెల్లం జిలేబీ, పంచదార జిలేబీ ఇప్పటి వరకు తెలుసు. లేటెస్ట్గా వాటి సరసన చేరింది పన్నీర్ జిలేబీ. పట్టణంలోని జిలేబీ కొట్ల బజారులో శని, ఆదివారాల్లో స్పెషల్ పన్నీర్ జిలేబీని సిద్ధం చేస్తున్నారు. కిలో రూ.600 చొప్పున లభిస్తున్న నోరూరించే పన్నీర్ జిలేబీని ప్రజలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. మీరూ టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి..!


