News February 2, 2025
భారత జట్టుకు అభినందనలు: హోం మంత్రి అనిత

రెండవ సారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ అండర్-19 జట్టుకు ఏపీ ప్రభుత్వం తరఫున హోం మంత్రి వంగలపూడి అనిత ఎక్స్లో అభినందనలు తెలిపారు. కౌలాలంపూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష మూడు వికెట్లు తీసి 44 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. బౌలింగ్లో విశాఖకు చెందిన షబ్నం ఒక వికెట్ తీయడం సంతోషాన్ని కలిగించిందన్నారు.
Similar News
News December 8, 2025
పాలమూరు: ఓటు గోప్యం.. వెల్లడిస్తే నేరం..!

పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసి వచ్చిన తర్వాత ఏ అభ్యర్థికి ఓటు వేశారో అనే విషయాన్ని గోప్యంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే పద్ధతిని పాటించకపోతే ఎన్నికల నియమావళి 49ఏ ప్రకారం ఓటు వేయనీయరు. పోలింగ్ కేంద్రాల్లో అనుచిత ప్రవర్తనకు పాల్పడితే చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. # SHARE IT
News December 8, 2025
కేతేపల్లి: మూడుసార్లు సస్పెండ్.. సతీమణికి సర్పంచ్ టికెట్

కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన చిన్నబొస్క ప్రసాద్ గతంలో పలు కారణాలపై మూడుసార్లు (మొత్తం 18 నెలలు) సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ అయ్యారు. గ్రామ సభలు పెట్టలేదని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఉప సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేశారని ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడంతో, ప్రసాద్ సతీమణి చిన్నబొస్క శైలజ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.
News December 8, 2025
ఆదిలాబాద్: ఎన్నికల బరిలో వింత పోకడలు

పంచాయతీ ఎన్నికల్లో భిన్న పరిస్థితులు నెలకొంటున్నాయి. తాము సర్పంచిగా గెలవాలని అభ్యర్థులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. అభ్యర్థులు తమకు పోటీగా ఉన్న వారికి వేరేరకంగా మేలు చేస్తామని ఒప్పించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. 3వ విడతలోనూ నామినేషన్ల ఉపసంహరణ జరిగే అవకాశాలున్నాయి. ఖర్చులు ఇస్తామని, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు.


