News February 6, 2025
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు కెప్టెన్గా హిందూపురం యువకుడు

హిందూపురానికి చెందిన వసంత్ కుమార్ భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నేపాల్లో జరగనున్న టీ20 సిరీస్లో భారత జట్టు పాల్గొననుంది. ఈ టీమ్కు వసంత్ నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా ఆయనను వైసీపీ నేత గుడ్డంపల్లి వేణు రెడ్డి ఆధ్వర్యంలో నేతలు ఘనంగా సత్కరించారు. విజేతగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
Similar News
News December 6, 2025
బాపట్ల: విద్యార్థులకు గమనిక

ఆచార్య నాగర్జున యూనివర్సిటీలోని పలు సర్టిఫికెట్లకు విద్యార్థులు చెల్లించే ఫీజులను పెంచారు. ఈ మేరకు శుక్రవారం సీఈ శివప్రసాద రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఒరిజినల్ డిగ్రీ ఫీజు 2025లో ఉత్తీర్ణ సాధించిన వారికి సాధారణ ఫీజు రూ.1,200, తత్కాల్ రూ.4,450 గా నిర్ణయించారు. డూప్లికేట్ మార్కుల మెమో ఒక్కోదానికి గతంలో రూ.470 ఉండగా, ప్రస్తుతం రూ. 520కి పెరిగింది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News December 6, 2025
కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు (2/2)

వైరస్ ఆశించిన కొన్ని కూరగాయల మొక్కల ఆకులు ముడతలు పడి, ముడుచుకొని, నిక్కబొడుచుకొని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కల్లో ఆహారోత్పత్తి తగ్గి వాడిపోయినట్లుగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి, పైకి కిందికి ముడుచుకొని వికారంగా మారతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి, కణుపుల మధ్యదూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయకట్టడం తగ్గుతుంది.
News December 6, 2025
స్ఫూర్తిని రగిలించే డా.అంబేడ్కర్ మాటలు

➛ ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం
➛ మేకల్ని బలి ఇస్తారు. పులుల్ని కాదు. పులుల్లా బతకండి
➛ మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే
➛ ప్రజలకు ఓటు హక్కే ఆయుధం. పోరాడి రాజులవుతారో అమ్ముకుని బానిసలవుతారో వారి చేతుల్లోనే ఉంది
➛ విశ్వాసం కలిగి ఉండండి. ఆశను కోల్పోకండి
* ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి *


