News February 6, 2025

భారత దివ్యాంగుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హిందూపురం యువకుడు

image

హిందూపురానికి చెందిన వసంత్ కుమార్ భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నేపాల్‌లో జరగనున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు పాల్గొననుంది. ఈ టీమ్‌కు వసంత్ నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా ఆయనను వైసీపీ నేత గుడ్డంపల్లి వేణు రెడ్డి ఆధ్వర్యంలో నేతలు ఘనంగా సత్కరించారు. విజేతగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Similar News

News November 16, 2025

పల్నాడు: కాక రేపుతున్న వారసత్వ రాజకీయాలు

image

పల్నాడు జిల్లాలో వారసత్వ రాజకీయాలు కాక రేపుతున్నాయి. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు తమ వారసులను రాజకీయ బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే తమ వారసులను ప్రజలలోకి పంపి రాజకీయ ఒడిదుడుకులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

News November 16, 2025

త్వరలో HYDలో ఎనిమీ ప్రాపర్టీ ప్రాంతీయ కార్యాలయం

image

రాష్ట్రంలో ఎనిమీ ప్రాపర్టీలు పరిరక్షణ కోసం HYDలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబై ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వ్యవహారాలు చూస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీలపై రెవెన్యూశాఖ సర్వే నిర్వహించింది. మియాపూర్ పరిధిలో వందల ఎకరాలు ఉండగా, కొంతభాగం అక్రమ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.

News November 16, 2025

కిలిమంజారోను అధిరోహించిన అనంత జిల్లా యువతి

image

అనంతపురం(D) నార్పల(M) దుగుమర్రికి చెందిన కె.కుసుమ(19) ఈ నెల 8న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీస్టాండింగ్ పర్వతం కిలిమంజారో (5895M)ను 12న విజయవంతంగా అధిరోహించింది. శిఖరంపై జాతీయ జెండాతో పాటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, MLA బండారు శ్రావణి ఫొటోలను ఎగురవేసింది. 15న హైదరాబాద్‌కు చేరుకోనుంది.