News February 6, 2025
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు కెప్టెన్గా హిందూపురం యువకుడు

హిందూపురానికి చెందిన వసంత్ కుమార్ భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నేపాల్లో జరగనున్న టీ20 సిరీస్లో భారత జట్టు పాల్గొననుంది. ఈ టీమ్కు వసంత్ నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా ఆయనను వైసీపీ నేత గుడ్డంపల్లి వేణు రెడ్డి ఆధ్వర్యంలో నేతలు ఘనంగా సత్కరించారు. విజేతగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
Similar News
News October 20, 2025
వనపర్తి DCC అధ్యక్ష పదవికి 23 దరఖాస్తులు

వనపర్తి DCC అధ్యక్ష పదవికి మొత్తం 23 మంది దరఖాస్తు చేసుకున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. వనపర్తి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 19 మంది, దేవరకద్ర, మక్తల్ నుంచి ఇద్దరేసి చొప్పున దరఖాస్తు చేశారు. WNP నుంచి లక్కాకుల సతీష్, సాయి చరణ్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కిరణ్ కుమార్, తిరుపతయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏకాభిప్రాయంతో అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు జరుగుతోందని నేతలు చెబుతున్నారు.
News October 20, 2025
నెతన్యాహు వస్తే అరెస్ట్ చేస్తాం: కెనడా ప్రధాని

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్ట్ వారెంట్ను తమ దేశంలో అమలు చేస్తామని కెనడా పీఎం మార్క్ కార్నీ ప్రకటించారు. నెతన్యాహు తమ దేశంలో అడుగుపెడితే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. బ్లూమ్బర్గ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాపై యుద్ధ నేరాలకు గాను 2024 నవంబర్ 21న నెతన్యాహుపై ICC అరెస్ట్ <<14671651>>వారెంట్ జారీ <<>>చేసిన విషయం తెలిసిందే.
News October 20, 2025
పండుగ పూట విషాదం.. అయిజ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అయిజ-గద్వాల రోడ్డులో బింగిదొడ్డి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిజ మాలపేటకు చెందిన వీరేష్ మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న వీరేష్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేసే వీరేష్ మృతితో అయిజలో పండుగపూట విషాదం నెలకొంది.