News February 25, 2025
భారీ భద్రతలతో పోలింగ్: కలెక్టర్

భారీ భద్రతలతో ఎమ్మెల్సీ ఎన్నిలక పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 8 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 37 మంది ఎస్సైలు, 69 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, 221 మంది పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర భధ్రతా సిబ్బందితో కలిసి 477 మందిని పోలింగ్ ప్రక్రియకు వినియోగించనున్నట్లు తెలిపారు. 70 మంది జోనల్ అధికారులను, 99 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు.
Similar News
News October 14, 2025
మోదీ, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్

AP: రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ భాగస్వామ్యంపై Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ‘$15 బిలియన్ల పెట్టుబడితో విశాఖలో అతిపెద్ద AI డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. రాష్ట్రంతో పాటు దేశానికి ఇది ఎంతో ముఖ్యం. చాలామందికి ఉపాధి లభించనుంది. యంగ్ ప్రొఫెషనల్స్కు టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. PM మోదీ, CM CBN, కేంద్ర మంత్రులు సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్, సుందర్ పిచాయ్కి నా కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.
News October 14, 2025
సిద్దిపేట: మందుబాబులకు జరిమానా.. జైలు శిక్ష

సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మందికి రూ.23,300 జరిమానా, ఓ వ్యక్తికి ఒక రోజు జైలు శిక్ష, మరో వ్యక్తికి 2 రోజుల జైలు విధిస్తూ న్యాయమూర్తి వి.తరుణి తీర్పునిచ్చారని సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో ఆయా చౌరస్తాలలో తనిఖీలు చేపట్టగా, 18 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ఆయన పేర్కొన్నారు.
News October 14, 2025
వీరఘట్టం: కట్లు విప్పుతుండగా వ్యాన్ డ్రైవర్ మృతి

ప్రమాదవశాత్తు వీరఘట్టం మెయిన్ రోడ్లో ఓ వ్యాన్ డ్రైవర్ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. విజయవాడ నుంచి గోనె సంచుల లోడ్తో వీరఘట్టం వచ్చిన డ్రైవర్ కట్లు విప్పుతుండగా ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి- క్యాబిన్కు మధ్యలో జారిపడి ఇరుక్కుపోయాడు. స్థానికులు ఆయన్ను బయటికి తీసుకు వచ్చినప్పటికీ క్షణాల్లోనే మృతి చెందాడు. మృతుడు యాకుబ్గా గుర్తించారు. ఎస్ఐ జి.కళాధర్ కేసు నమోదు చేశారు.