News February 25, 2025

భారీ భద్రతలతో పోలింగ్: కలెక్టర్ 

image

భారీ భద్రతలతో ఎమ్మెల్సీ ఎన్నిలక పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 8 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 37 మంది ఎస్సైలు, 69 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, 221 మంది పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర భధ్రతా సిబ్బందితో కలిసి 477 మందిని పోలింగ్ ప్రక్రియకు వినియోగించనున్నట్లు తెలిపారు. 70 మంది జోనల్ అధికారులను, 99 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు.

Similar News

News November 18, 2025

ములుగు: మావోయిస్టు హిడ్మా నేపథ్యం!

image

ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. సుక్మాలోని పూర్వర్తికి చెందిన మడవి హిడ్మాపై రూ.కోటి రివార్డు సైతం ఉంది. చిన్నతనంలోనే మావో సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. ఏరియా కమిటీలో, DVCM(డివిజనల్ కమిటీ సభ్యుడు), DKSZC(దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ) తర్వాత సీసీ కమిటీ మెంబర్‌గా ప్రస్తుతం కొనసాగాడు.

News November 18, 2025

ములుగు: మావోయిస్టు హిడ్మా నేపథ్యం!

image

ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. సుక్మాలోని పూర్వర్తికి చెందిన మడవి హిడ్మాపై రూ.కోటి రివార్డు సైతం ఉంది. చిన్నతనంలోనే మావో సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. ఏరియా కమిటీలో, DVCM(డివిజనల్ కమిటీ సభ్యుడు), DKSZC(దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ) తర్వాత సీసీ కమిటీ మెంబర్‌గా ప్రస్తుతం కొనసాగాడు.

News November 18, 2025

HYD: YCP అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్

image

YCP కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్టు అయ్యారు. కూకట్‌పల్లిలోని తన ఇంట్లో ఉ.7 గం.కు పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, అరెస్టు సమయంలో భయభ్రాంతులకు గురిచేసి, ఫోన్లు లాక్కొని అమానుషంగా ప్రవర్తించారని వెంకటరెడ్డి భార్య ఆరోపించారు. ప్రస్తుతం తాడిపత్రికి తరలిస్తున్నారు. స్థానిక పార్టీ నేతలు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.