News February 13, 2025

భారీ భద్రత మధ్య విజయవాడకు వల్లభనేని వంశీ

image

వల్లభనేని వంశీని భారీ పోలీసుల భద్రత మధ్య హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు. ఏపీ సరిహద్దులో వాహనాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సరిహద్దుల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

Similar News

News November 7, 2025

GDK పట్టణంలో స్కౌట్& గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం

image

గోదావరిఖని RCOA క్లబ్ సమీపంలోని బైడన్ పావెల్ పార్క్ వద్ద భారత్ స్కౌట్& గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అధికార ప్రతినిధి ముప్పిడి రవీందర్ రెడ్డి పాల్గొని జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో స్కౌట్స్& గైడ్స్ ఎనలేని సేవ చేస్తుందని కొనియాడారు. మాస్టర్ బుచ్చయ్య, దేవేందర్, కుమార్, స్వర్ణలత, లక్ష్మీ కుమారి, రాజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

News November 7, 2025

RGM: 12న క్యాబినెట్ మీటింగ్ వల్ల 16వ తేదీకి వాయిదా

image

సింగరేణి సంస్థలు మెడికల్ పూర్తిచేసిన 473 మంది అభ్యర్థులు ఈనెల 16న కొత్తగూడెంలో నిర్వహించే కార్యక్రమాలలో నియామక పత్రాలు తీసుకుంటారని ఐఎన్టీయుసీ రామగుండం నాయకులు గడ్డం తిరుపతి యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కారుణ్య నియామకం పద్ధతిలో అభ్యర్థులు ఉపాధి పొందనున్నారని అన్నారు. 12న క్యాబినెట్ మీటింగ్ వల్ల 16వ తేదీకి వాయిదా వేయడం జరిగిందన్నారు.

News November 7, 2025

GDK: బంగారు పతకాలు అందుకున్న ఎంబీఏ విద్యార్థులు

image

గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళాశాలకు చెందిన ఆరుగురు ఎంబీఏ విద్యార్థులు బంగారు పతకాలను అందుకున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించినందుకు గాను డీ.తరుణ, ఎం.మౌనిక, డీ.ఉషశ్రీ, పీ.కళ్యాణి, కే.కళ్యాణి, సీహేచ్‌.సాగరికలు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ద్వితీయ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా ఈ బంగారు పతకాలు అందుకున్నారు.